బెటాలియన్‌ను సందర్శించిన అదనపు డీజీపీ | - | Sakshi
Sakshi News home page

బెటాలియన్‌ను సందర్శించిన అదనపు డీజీపీ

Sep 25 2025 7:13 AM | Updated on Sep 25 2025 7:13 AM

బెటాలియన్‌ను సందర్శించిన అదనపు డీజీపీ

బెటాలియన్‌ను సందర్శించిన అదనపు డీజీపీ

చుంచుపల్లి: చాతకొండ 6వ బెటాలియన్‌ను టీజీఎస్‌పీ బీఎన్‌ అడిషనల్‌ డీజీపీ సంజయ్‌ కుమార్‌ జైన్‌, కలెక్టర్‌ జితీష్‌ వి.పాటిల్‌, ఎస్పీ రోహిత్‌ రాజుతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా బెటాలియన్‌లో చేపట్టిన డైనింగ్‌ హాల్‌, జిమ్‌ రూమ్‌, పార్కింగ్‌ షెడ్‌, బుద్ధ విగ్రహం, ఓపెన్‌ జిమ్‌, క్రీడా మైదానం, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఆఫీస్‌ రూమ్‌, అకమిడేషన్‌ హాళ్లను ప్రారంభించారు. అనంతరం బెటాలియన్‌ సిబ్బందితో వసతుల కల్పనపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్‌ కమాండెంట్‌ డి.శివప్రసాద్‌ రెడ్డి, అదనపు కమాండెంట్‌ బి.వెంకటేశ్వర రెడ్డి, అసిస్టెంట్‌ కమాండెంట్‌లు జి.వి కిరణ్‌కుమార్‌, సింగరేణి వెల్ఫేర్‌ జీఎం బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement