‘విత్తనం నుంచి మహావృక్షంగా’ పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘విత్తనం నుంచి మహావృక్షంగా’ పుస్తకావిష్కరణ

Sep 15 2025 8:43 AM | Updated on Sep 15 2025 8:43 AM

‘విత్తనం నుంచి మహావృక్షంగా’ పుస్తకావిష్కరణ

‘విత్తనం నుంచి మహావృక్షంగా’ పుస్తకావిష్కరణ

ఖమ్మంగాంధీచౌక్‌: పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య జీవిత చరిత్రపై రచయిత నరేష్‌ రాసిన ‘విత్తనం నుండి మహావృక్షంగా వనజీవి జీవితం’ పుస్తకాన్ని స్థానిక ఆక్స్‌ఫర్డ్‌ హైస్కూల్‌లో పలువురు రచయితలు, కవులు ఆదివారం ఆవిష్కరించారు. అక్షరాల తోవ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో దాసరోజు శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్‌ కడవెండి వేణుగోపాల్‌, కవులు, రచయితలు, సాహితీవేత్తలు సీతారాం, అట్లూరి వెంకటరమణ, సైదులు, ఐనాల నయీమీ పాషా, వురిమళ్ల సునంద, వనజీవి రామయ్య సతీమణి జానకమ్మ, నామా పురుషోత్తం, రాచమళ్ల ఉపేందర్‌, సయ్యద్‌ షఫీ, కన్నెగంటి వెంకటయ్య, రమణ, బ్రహ్మం, నాగమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement