
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
భద్రాచలంఅర్బన్: నిర్మాణ రంగ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు రక్షించుకునేందుకు వచ్చే నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.కోటంరాజు తెలిపారు. బండారు చందర్రావు భవన్లో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల సంక్షేమ చట్టం రద్దయిందని దీన్ని కాపాడుకోవాల్సిన ప్రతీ ఒక్క కార్మికుడిపై ఉందన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ నేతలు ఏజే రమేష్, ఎంబీ నర్సారెడ్డి, నరసింహారావు, శరత్బాబు, ఎర్రంశెట్టి వెంకటరామారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సన్నబియ్యం తూకంపై విచారణ
ములకలపల్లి: ములకలపల్లి రేషన్షాపులో బియ్యం తూకం తేడా అంశంపై ‘రేషన్ షాపులో మాయాజాలం’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురిమైంది. దీనికి స్పందించిన అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. తహసీల్దార్ బి.గనియా ఆదేశాల మేరకు గిర్దావర్–2 భద్రు ఆ రేషన్ షాపులోని బియ్యం నిల్వలు, స్టాకు రిజిస్టర్లను పరిశీలించి సేల్స్మెన్ అగ్గిరామ్తో మాట్లాడి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించనున్నట్లు గిర్దావర్–2 తెలిపారు.