
చిన్నారికి కలెక్టర్ అభినందన
చుంచుపల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు బాధ్యతగా కృషి చేస్తూ ‘వాక్ ఫర్ ట్రీస్’అనే అంశంతో ప్రతిరోజూ మొక్కలు నాటుతున్న చిన్నారి మూడు విశ్వామిత్ర చౌహాన్ను శుక్రవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు. ఈమేరకు ఇటీవల అడవుల నుంచి సేకరించిన వివిధ రకాల చెట్ల గింజల ను అటవీఅధికారులకు అందజేసిన సందర్భంగా శనివారం ప్రశంసపత్రాన్ని అందించారు. అనంతరం విశ్వామిత్రతో కలిసి కలెక్టర్తో పాటు డీఎఫ్ఓ కిష్టాగౌడ్ మామిడి మొక్కలు నా టారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాహు ల్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ స్కూల్కు
విద్యార్థిని ఎంపిక
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): మండలంలోని అబ్బుగూడెం ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఓరుగంటి తరుణ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికై ంది. ఈ నెల 26న ఖమ్మంలో జరిగిన ఎంపికల్లో విద్యార్థిని ప్రతిభ చూపింది. ఈ మేరకు శనివారం పాఠశాలలో బాలికను ఎంఈఓ ఉండేటి ఆనంద్కుమార్ అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.లక్ష్మణ్, డి.రమేష్, ఎం. బాలు, జి.రామ్మోహన్, ఎ.సుభద్ర పాల్గొన్నారు.
గిరిజన విద్యార్థినికి
ఆర్థిక సాయం
భద్రాచలంటౌన్: నీట్ శిక్షణ తీసుకుంటున్న గిరిజన విద్యార్థిని వజ్జ రోజాకు ఐటీడీఏ రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన ఆర్థిక సాయాన్ని పీఓ బి.రాహుల్ శనివారం తన చాంబర్లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖ అంకంపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన రోజా ‘పది’ఫలితాల్లో పాఠశాలల్లో 2వ ర్యాంకు, ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440 మార్కులకు గాను 424 సాధించిందని తెలిపారు. విద్యార్థిని చదువుకు చేయూతనందించేందుకు ఈ సాయం అందించామన్నారు. ఏపీఓ డేవిడ్ రాజ్, ఎస్ఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారికి కలెక్టర్ అభినందన

చిన్నారికి కలెక్టర్ అభినందన