రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

Jun 29 2025 2:44 AM | Updated on Jun 29 2025 2:44 AM

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

దమ్మపేట: మండలంలోని రంగువారిగూడెం ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి ఆళ్ల లోకేష్‌ రాష్ట్రస్థాయి క్రీడా ప్రతిభ పోటీలకు ఎంపికయ్యాడు. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పరిధిలో ఉన్న క్రీడా పాఠశాలల్లో ప్రవేశం కోసం ఈ నెల 26న కొత్తగూడెంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా ప్రతిభ పోటీల్లో ప్రతిభ చూపగా.. జూలై 1 నుంచి 5 వరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా లోకేష్‌ను ఎంఈఓ కీసర లక్ష్మి, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement