
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
దమ్మపేట: మండలంలోని రంగువారిగూడెం ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి ఆళ్ల లోకేష్ రాష్ట్రస్థాయి క్రీడా ప్రతిభ పోటీలకు ఎంపికయ్యాడు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న క్రీడా పాఠశాలల్లో ప్రవేశం కోసం ఈ నెల 26న కొత్తగూడెంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా ప్రతిభ పోటీల్లో ప్రతిభ చూపగా.. జూలై 1 నుంచి 5 వరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా లోకేష్ను ఎంఈఓ కీసర లక్ష్మి, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.