కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత

Jun 29 2025 2:44 AM | Updated on Jun 29 2025 2:44 AM

కళలను

కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత

పాల్వంచ: కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని కేటీపీఎస్‌ 7వ దశ సీఈ పి.శ్రీనివాసబాబు అన్నారు. శనివారం స్థానిక కేటీపీఎస్‌ సీతారామ కల్యాణ మండపంలో పాకాలపాటి కృష్ణయ్య సాంస్కృతిక కళాపీఠం సమక్షాన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కీలమైందని అన్నారు. చిన్నప్పటి నుండే కళలపై మక్కువ పెంచుకునేలా కృషి చేయాలని, కళాకారుల ఆదరించి ప్రోత్సహించాలన్నారు. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకురాలు తోట దేవీప్రసన్న, మధిర రంగ స్థల కళాకారుల సమైఖ్య అధ్యక్షులు పుతుంబాక కృష్ణ ప్రసాద్‌, బాబులాల్‌, ఎస్‌వీఆర్‌కే.ఆచార్యులు, వెంకటాచారి, జోన్నాడ కృష్ణ, ముత్యాల హనుమంతరావు, కృష్ణ, వెంకన్న, రోశయ్య చౌదరి, బాషా, పాకాలపాటి రోశయ్య చౌదరి, దామోదర్‌రావు, బాలస్వామి, పున్నయ్య పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌లో ప్రతిభ

అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): హైదరాబాద్‌లో జరిగిన 11వ, ఉమ్మడి రాష్ట్ర రైఫిల్‌ షూటింగ్‌లో మండలంలోని కట్టుగూడెం గ్రామానికి చెందిన బాలుడు రియాన్‌ పఠాన్‌ రాణించాడు. హైదరాబాద్‌లో గచ్చిబౌలి షూటింగ్‌ రేంజ్‌లో శనివారం జరిగిన పోటీల్లో రియాన్‌ పాల్గొని, ప్రతిభ చూపి, కేరళలో జరగబోయే ప్రీనేషనల్‌ (సౌత్‌జోన్‌), ఆలిండియా మౌలాన్‌క్లర్కోలో అతడు స్థానం సాధించాడు. తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ జె.కిరణ్‌, ఏపీ రైఫిల్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ రాజ్‌కుమార్‌ రియాన్‌ పఠాన్‌ను సత్కరించారు. ఆయన తండ్రి రహీం పఠాన్‌ జాతీయస్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో పతకాలు సాధించాడు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

దమ్మపేట: మండలంలోని మందలపల్లి గ్రామ శివారులోని పామాయిల్‌ క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. పామాయిల్‌ క్షేత్రంలో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని శనివారం స్థానికులకు కనపడగా.. పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మూడు రోజుల క్రితమే ఆ వ్యక్తి మరణించినట్లుగా భావించారు. మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటుందని, అతడి ముఖంపై పలు గాయాలు కాగా రక్తస్రావం జరిగిందని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అశ్వారావుపేట మార్చురికీ తరలించారు. మందలపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి మహాదేవ గోపి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, మృతుడి వివరాలు తెలిసినవారు 87126 82065 నంబర్‌కు తెలపాలని ఎస్సై సాయికిషోర్‌రెడ్డి సూచించారు.

కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత1
1/2

కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత

కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత2
2/2

కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement