
జూలై 5న కౌన్సెలింగ్
సింగరేణి(కొత్తగూడెం): నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 150 సీట్ల భర్తీ కోసం సింగరేణి కార్మికులు, మాజీ కార్మికుల పిల్లలు ఈ నెల 28 నుంచి 3వ తేదీ వరకు ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్–30, కంప్యూటర్–30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్– 30, మెకానికల్–30, మైనింగ్–30 సీట్లు ఉన్నా యని, https:# scp. scpolytechnic. com/ online& admission వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసి, కాపీని డౌన్లోడ్ చేసి, సంభందిత గని, డిపార్ట్మెంట్ హెచ్ఓడీతో అటెస్టేషన్ చేయించి జూలై 5వ తేదీన జరిగే కౌన్సెలింగ్కు హాజరు కావాలని పేర్కొంది. వివరాల కోసం 90102 22161, 87901 12515, 94911 44168 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
నేడు 10 మంది అధికారుల ఉద్యోగ విరమణ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో 10 మంది అధికారులు సోమవారం ఉద్యోగ విరమణ పొందనున్నారు. వారిలో ఐదుగురు జీఎంలు ఉన్నారు. జీఎం ఈఅండ్ఎం (సోలార్) జీఎస్ జానకీరామ్, జీఎం ఈఅండ్ఎం (ట్రాన్స్పోర్ట్) జె.నాగరాజు, కార్పొరేట్ ఏరియా ఆడిట్ జీఎం (ఎఫ్ అండ్ ఏ) గొర్రెపాటి వెంకటరమణ, జీఎం ఆర్అండ్డీ నారాయణరావు, హైదరాబాద్ సింగరేణి భవన్లో ఎంఎం విభాగంలో జీఎం ఈఅండ్ఎం ఎన్వీ రాజశేఖర్, డైరెక్టర్ ఈఅండ్ఎం అడిషినల్ జీఎం కామిశెట్టి వెంకటేశ్వరరావు, కార్పొరేట్ సివిల్ డీవైజీఎం (సివిల్) రాజశేఖర్, కార్పొరేట్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ ఏజీఎం (ఐఈ) గోనే శ్రీకాంత్, మెయిన్ ఆస్పత్రి డీవైసీఎంఓ డాక్టర్ టి.రవీంద్ర, కార్పొరేట్ పర్సనల్ విభాగం సీనియర్ పీఓ తీటి శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ చేయనున్నారు.
మృతుడి వివరాలు లభ్యం
దమ్మపేట: పామాయిల్ క్షేత్రంలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించారు. శనివారం మండలంలోని మందలపల్లి శివారులోని పామాయిల్ క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం విదితమే. కాగా మృతుడి వివరాల కోసం పోలీసులు, మృతదేహం ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ఈ మేరకు ఏపీ, ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కుసిన వెంకటేశ్వరరావు, పాంచాలి దంపతులు మృతదేహం ఫొటో చూసి అశ్వారావుపేట మార్చురీలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి, తమ కుమారుడు సాయి (21)గా గుర్తించారు. కాగా మృతుడు అవివాహితుడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి తల్లితండ్రులకు అప్పగించారు. విచారణ చేస్తున్నామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు.
పేకాట స్థావరంపై దాడి
రఘునాథపాలెం: మండలంలోని పాపటపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం దాడులు నిర్వహించి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై ప్రత్యేక బృందంతో దాడులు చేపట్టారు. రూ.2,500 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.

జూలై 5న కౌన్సెలింగ్