
థమ్సప్ అనుకుని గడ్డిమందు తాగిన బాలుడు
కరకగూడెం: థమ్సప్ అనుకుని ఓ బాలుడు గడ్డిమందు తాగిన ఘటన మండలంలోని చొప్పల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జాడి నవీన్ – వరలక్ష్మి దంపతుల కుమారుడు ఐదేళ్ల వరుణ్తేజ ఆదివా రం ఉదయం ఇంట్లో ఆడుకుంటుండగా.. థమ్సప్ బాటిల్లో పోసిన గడ్డిమందు కనిపించింది. అయితే దాన్ని థమ్సప్గా భావించిన బాలుడు కొంత తాగాడు. కాసేపటికి కడుపునొప్పితో బాధపడడంతో నోరు వెంట నురగలు వస్తూ వాంతి చేసుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులు ఆటోలో కరకగూడెం పీహెచ్సీకి, అక్కడి నుంచి 108 ద్వారా మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఖమ్మం తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
గంజాయి పట్టివేత
పాల్వంచ: కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ సతీశ్ వివరాలు వెల్లడించారు. ఈనెల 28వ తేదీ సాయంత్రం స్థానిక రెజీనా కాన్వెంట్ సమీపంలో ఎస్ఐ సుమన్ వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన కారు ను ఆపేందుకు యత్నించగా.. అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. మరో ముగ్గురితోపాటు 11.100 కేజీల గంజాయి పట్టుబడింది. వారు చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన కందిమళ్ల శ్రీహరి, జొన్నలగడ్డ రాకేశ్రెడ్డి, బోనకల్ మండలం ముష్టికుంట్లవాసి ఎస్కే జావిద్గా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు.
యూరియా తిని 11 మేకల మృతి
ములకలపల్లి: యూరియా తినడంతో 11 మేకలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని మంగపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మంగపేట గ్రామానికి చెందిన వాడె దారయ్యకు చెందిన మేకలు గ్రామశివారు లో మేతకు వెళ్లాయి. ఈ క్రమంలో ఓ రైతు ట్రాక్టర్లో యూరియా బస్తాలు తరలిస్తుండ గా ఒకటి రోడ్డుపై పడటంతో యూరియా కిందపడింది. సమీపంలో ఉన్న 11 మేక లు యూరియా తిని మృతిచెందాయి. సుమారు రూ.1.5 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపాడు.

థమ్సప్ అనుకుని గడ్డిమందు తాగిన బాలుడు