‘వాగు’.. బాగు చేయరూ..? | - | Sakshi
Sakshi News home page

‘వాగు’.. బాగు చేయరూ..?

Jun 30 2025 4:01 AM | Updated on Jun 30 2025 4:01 AM

‘వాగు’.. బాగు చేయరూ..?

‘వాగు’.. బాగు చేయరూ..?

● పెదవాగు ప్రాజెక్టుకు గండి పడి ఏడాది ● సమావేశాలు.. సందర్శనలు.. ప్రతిపాదనలతో సరి.. ● ఇప్పటివరకు నిధుల కేటాయింపు శూన్యం ● ఇక వర్షాధారంతోనే పంటలు వేసుకోవాలా?

అశ్వారావుపేట: అశ్వారావుపేట, ఏపీలోని కుక్కు నూరు, వేలేరుపాడు మండలాల మారుమూల ఏజె న్సీ గిరిజన గ్రామాల కల్పతరువు పెదవాగు ప్రాజె క్టు. 1981 నుంచి ప్రాజెక్టుకు దిగువనున్న ఆయకట్టు గ్రామాలు పంటలతో కళకళలాడేవి. గతేడాది జులై 18న వచ్చిన క్లౌడ్‌బరస్ట్‌కు పెదవాగు ప్రాజెక్టు కట్ట 250 మీటర్ల మేర కోతకు గురైంది. పలు చోట్ల కట్టలు దెబ్బతిన్నాయి. దీంతో గుమ్మడవల్లి, కొత్తూ రు, అనంతారం గ్రామాల్లో 71 నివాస గృహాలు దెబ్బతినగా, 391 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. అనంతరం ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రాజెక్టును సందర్శించారు. కానీ, ప్రయో జనం శూన్యమే. కంటితుడుపుగా రింగ్‌బండ్‌ నిర్మించినా.. నాణ్యతాలోపాల కారణంగా దానికి కూడా గండ్లు పడుతున్నాయని సమాచారం. నీటినిల్వలు పెరిగితే రింగ్‌ బండ్‌ కొట్టుకుపోతుందని ఆయకట్టు రైతులు, గుమ్మడవల్లి వాసులు ఆందోళన చెందుతున్నారు.

నిధులు లేవు..

సందర్శనలు, సమావేశాలు,అంచనాలు తప్ప నిధు ల కేటాయింపు మాత్రంలేదు. 80శాతం ఆయకట్టు ఏపీ లో ఉండటంతో 80శాతం నిధులు సమకూర్చుతామని జీఆర్‌ఎంబీ సమావేశంలో అంగీకరించి నా.. కదలిక లేదు. ప్రాజెక్టు సామర్థ్యం 20 వేల క్యూ సెక్కులు కాగా ప్రస్తుతం రింగ్‌బండ్‌ సామర్థ్యం కేవలం 1.8వేల క్యూసెక్కుల లోపే. వరదఉధృతి ఎక్కువగా ఉన్నా.. రింగ్‌ బండ్‌ నిలిచి ఉంటుందనే నమ్మకం లేదు. ఏపీ ప్రభుత్వం 82శాతం నిధులు జీఆర్‌ ఎంబీకీ చెల్లిస్తే పనులు మొదలవుతాయని రైతులంటున్నారు.

సందర్శనలు..

గతేడాది జులై 21వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెదవాగు ప్రాజెక్టును సందర్శించారు.

అదే నెల 22వ తేదీన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాజెక్టును పరిశీలించి.. పున:నిర్మిస్తామని ప్రకటించారు.

అదే నెల 26వ తేదీన రూ.3.5 కోట్ల వ్యయంతో తాత్కాలిక రింగ్‌ బండ్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

ఆగస్టు 31వ తేదీ నాటికి రింగ్‌బండ్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి నీరు నిల్వ చేశారు.

సెప్టెంబర్‌ 1వ తేదీన కురిసిన భారీ వర్షంతో రింగ్‌బండ్‌కు భారీ గండి పడి 30 మీటర్ల దాకా కొట్టుకుపోయింది.

ఈ ఏడాది మార్చి 17వ తేదీన జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌, మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు పెదవాగు ప్రాజెక్టును సందర్శించారు. అదే రోజు కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌ కూడా వచ్చారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీన హైదరాబాద్‌లో గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సమావేశం నిర్వహించారు. తెలంగాణతోపాటు ఏపీకి చెందిన నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు (ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌ అనిల్‌కుమార్‌, వెంకటేశ్వరరావు) హాజరయ్యారు. గండ్లు పూడ్చేందుకు రూ.19 కోట్లు అవసరమని గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement