బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం బీచ్లతోపాటు, పర్యాటక రంగాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను ఆస్వాదించేందుకు వచ్చే ప్రయాణికులు రహదారిపై ఉన్న డైవర్షన్లు, అక్కడక్కడ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను కూడా గమనించడం లేదు. అవగాహన లేని ప్రయాణాలతోనే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. పర్చూరు వైపు నుంచి వాడరేవుకు వచ్చే మార్గంలో కారంచేడు వద్ద సుమారు 5 కిలోమీటర్ల ముందుగానే రోడ్డు డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం వలన ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. కచ్చితమైన విజువల్ బోర్డులను ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చెయ్యాలని వాహనదారులు కోరుతున్నారు.


