వైద్య ఆరోగ్య శాఖ విధులకు హాజరుకారు
సచివాలయ ఏఎన్ఎంలు
గుంటూరు మెడికల్: సచివాలయ ఏఎన్ఎంలకు కేవలం వైద్య ఆరోగ్య శాఖ విధులకు పరిమితం చేసేవరకు వారు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి విధులకు హాజరుకారని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు తెలిపారు. పలువురు సచివాలయ ఏఎన్ఎంలు ఏపీ ఎన్జీఓ నేతలను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన ఏఎన్ఎంలకు ఇతర విధులు అప్పజెప్పకూడదనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాటి అమలులో విఫలమవుతున్నట్లు వెల్లడించారు. ఏఎన్ఎంల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తాము అండగా ఉంటామన్నారు. గుంటూరు అర్బన్ సచివాలయాల పరిధిలోని ఏఎన్ఎంలు వారి విభాగంలోని విధులనే కాకుండా, మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన అనేక సర్వేలు నిర్వహించాలని మున్సిపల్ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడించారు. ఏఎన్ఎంలపై ఒత్తిడి తగ్గించడానికి డీఎంహెచ్ఓ జోక్యం చేసుకుని కేవలం వైద్య ఆరోగ్య శాఖకు చెందిన విధులు మాత్రమే ఏఎన్ఎంలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పలుమార్లు విన్నపా లు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం నుంచి సచివాలయ ఏఎన్ఎంలు వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన విధులకు హాజరు కారని ఘంటసాల శ్రీనివాసరావు వెల్లడించారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఆరాధ్యుల శ్యామ్సుందర శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, నగర అధ్యక్షుడు ఎస్.పి.ఎస్.సూరి, కార్యదర్శి సి.హెచ్.కళ్యాణ్కుమార్, శ్రీధర్రెడ్డి, కృష్ణకిషోర్, అబ్దుల్ కరీం, శేషగిరిరాజు, పలువురు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
పీఆర్సీ కమిటీ త్వరగా ఏర్పాటు చేయాలి
గుంటూరు మెడికల్: పీఆర్సీ కమిటీ త్వరగా ఏర్పాటు చేయాలని ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరగాలని ఏపీ ఎన్జీజీవో కార్యవర్గం తీర్మానించింది.
ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు
ఘంటసాల శ్రీనివాసరావు
వైద్య ఆరోగ్య శాఖ విధులకు హాజరుకారు


