
అక్షరంపై కక్ష సాధింపు తగదు
అక్షరం ప్రశ్నిస్తుంది.. అక్రమం ఎక్కడుంటే అక్కడ గర్జిస్తుంది. ఒక అక్షరాన్ని బహిష్కరిస్తే లక్ష పుట్టుకొస్తాయి. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. కూటమి ప్రభుత్వం దాన్ని కాల రాస్తోంది. సాక్షి మీడియాతో పాటు ఎడిటర్, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. తప్పులు ఎత్తి చూపుతున్న సాక్షి దినపత్రిక, ఎడిటర్, పాత్రికేయులపై కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. సమాజంలో ప్రతి ఒక్కరూ పత్రికా సేచ్ఛను పరిరక్షించాలి.
–దొంతిరెడ్డి వేమారెడ్డి,
వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త