
జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికలు
రొంపిచర్ల:స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ సెలక్షన్స్ సోమవారం జరిగాయి. ఈ సెలక్షన్స్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గల వివిధ పాఠశాలల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన సాఫ్ట్బాల్ పోటీ ల్లో ప్రతిభ కనబరిచిన 32మంది క్రీడాకారులను ఉమ్మడి గుంటూరు జిల్లా టీంకు ఎంపికచేశారు. వారిలో బాలుర నుంచి 16 మంది, బాలికల నుంచి 16మందిని ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెలలో వైజాగ్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పీసీ కమిటీ చైర్మన్ ఏడుకొండలు తెలిపారు. క్రీడాకారులను విశ్రాంత హెచ్ఎం ఎన్.రామకష్ణారెడ్డి, హెచ్ఎం బీఎం సుభాని అభినందించారు.
ఎంపికై న బాలికల టీంతో వ్యాయామ ఉపాధ్యాయులు బాలుర టీంతో వ్యాయామ ఉపాధ్యాయులు

జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికలు