ఇంద్రకీలాద్రిపై వారాంతంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై వారాంతంలో భక్తుల రద్దీ

Sep 14 2025 2:36 AM | Updated on Sep 14 2025 2:36 AM

ఇంద్రకీలాద్రిపై   వారాంతంలో భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రిపై వారాంతంలో భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రిపై వారాంతంలో భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వారాంతం, రెండో శనివారం సెలవు కావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శనివారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరో వైపు అమ్మవారికి నిర్వహించిన పలు విశేష పూజల్లో ఉభయదాతలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణంతో పాటు హోమాలలో ఉభయదాతలు పాల్గొని తమ నామగోత్రాలతో పూజలు జరిపించుకున్నారు. మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. సర్వ దర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 క్యూలైన్ల భక్తులు బారులు తీరి కనిపించారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలోనూ పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement