వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా డీహైడ్రేషన్ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి. ఇన్ఫెక్షన్లు రావ డానికి ఆస్కారం ఉంటుంది. ఈ సీజన్లో కిడ్నీలను కాపాడుకోవాలంటే ఒక రోజుకు 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. ఎండలో ఎక్కువగా తిరిగేవారు ఇంకా ఎక్కువ నీరు తాగితే మంచిది. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ఫైబర్ ఎక్కువుగా ఉండే పదార్ధాలు ఉండేలా చూడాలి, తీసుకునే ఆహరంలో ఉప్పును తగ్గించాలి. – డాక్టర్ ఎన్ దినేష్కుమార్రెడ్డి,
మూత్రపిండాల వైద్య నిపుణులు, కడప.


