కమనీయం.. లక్ష్మీనరసింహుని కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. లక్ష్మీనరసింహుని కల్యాణం

Apr 5 2026 7:48 AM | Updated on Apr 5 2026 7:48 AM

కమనీయం.. లక్ష్మీనరసింహుని కల్యాణం

గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారి కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. శని వారం స్వాతి నక్షత్రంతో పాటు స్వామివారి జన్మ దినం కావడంతో టీటీడీ వారి ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించారు. కల్యాణమండపం వద్ద చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లివేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు. ముత్యాల తంబ్రాలతో స్వామివారి పెళ్లివేడుక నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య మేళతాళాలతో శాస్త్రోక్తంగా మాంగల్యధారణ కావించారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయఅర్చకులు,టీటీడీ అధికారులు పాల్గోన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement