
వైఎస్సార్సీపీ నాయకులపై దాడి
పీలేరురూరల్ : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పీలేరులో జరిగిన గణేష్ ఊరేగింపులో రివాల్వర్తో ఓ యువకుడు హల్చల్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం పీలేరు పట్టణంలో గణేష్ విగ్రహాల సామూహిక ఊరేగింపు, నిమజ్జనం జరిగింది. ఊరేగింపు సందర్భంగా చెన్నారెడ్డికి చెందిన గణేష్ విగ్రహం వద్ద ఓ యువకుడు రివాల్వర్తో డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సమాచారం అందుకున్న సీఐ యుగంధర్ విచారణ జరిపి యువకుడు అధికార పార్టీకి చెందిన గుండ్లూరు వెంకటరత్నంగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా రివాల్వర్ ఆకారంలో ఉన్న లైటర్గా గుర్తించినట్లు సీఐ తెలిపారు. లైటర్ను స్వాధీనం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ శివకుమార్ ఎదుట బైండోవర్ చేసి విడుదల చేశారు.

వైఎస్సార్సీపీ నాయకులపై దాడి