రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

Sep 1 2025 2:51 AM | Updated on Sep 1 2025 2:51 AM

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

రాజంపేట రూరల్‌ : రాజంపేట పార్లమెంట్‌ స్థానాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి చంద్రయ్య డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ కార్యాలయం ఎదుట ఆదివారం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు సోమవారం పర్యటనలో ప్రకటించాలన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ.సికిందర్‌, కార్మిక నాయకులు మహమ్మద్‌ హుస్సేన్‌, వేముల నరసింహులు, కాయల రమణ, వేంకప్ప, జీ రమణ, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement