మాజీ ముఖ్యమంత్రిని కలిసిన నేతలు | - | Sakshi
Sakshi News home page

మాజీ ముఖ్యమంత్రిని కలిసిన నేతలు

Jun 25 2025 6:54 AM | Updated on Jun 25 2025 6:54 AM

మాజీ

మాజీ ముఖ్యమంత్రిని కలిసిన నేతలు

కడప కార్పొరేషన్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆర్‌. రమేష్‌ యాదవ్‌, వైఎస్సార్‌ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు ఎన్‌. శివరామ్‌ కలిశారు. మంగళవారం విజయవాడలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి పలు విషయాలను వివరించారు. ముఖ్యంగా జిల్లా బీసీ విభాగం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్‌లో రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా బీసీ విభాగం ఎలా పనిచేస్తుందో విధి విధానాల గురించి వివరించారు. దీనిపై వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పందిస్తూ మీలాంటి వారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మోస పూరిత హామీలపై ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు.

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎన్‌ఆర్‌ఐలు

కడప కార్పొరేషన్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐలు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వారు ఆయనను కలిసి ప్రవాసాంఽధ్రుల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న మన తెలుగువారు జాగ్రత్తలు తీసుకోవాలని, భారత ప్రభుత్వ ఆదేశాలను అనుసరించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా ద్వారా సందేశం ఇవ్వాలని వారికి సూచించారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్‌ కన్వీనర్‌ ఏ. సాంబశివారెడ్డి, గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలియాస్‌, కువైట్‌ ఐటీ ఇన్‌చార్జి షేక్‌ అఫ్సర్‌ అలీ, బీసీ సభ్యుడు నరసింహ యాదవ్‌, మైనార్టీ సభ్యుడు షేక్‌ నాసర్‌, ఖతార్‌ మైనార్టీ ఇన్‌చార్జి షేక్‌ దర్బార్‌ తదితరులు ఉన్నారు.

మాజీ ముఖ్యమంత్రిని కలిసిన నేతలు1
1/1

మాజీ ముఖ్యమంత్రిని కలిసిన నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement