
మట్టికొట్టుకుపోవద్దు!
పొలాలకు కాదు వెంచర్లకు..
దేవుని కడప మట్టిని పొలాలకు అని చెప్పి అధికారుల వద్ద అనుమతి తోసుకుని వెంచర్లకు తరలిస్తూ వేలకు వేలు దండుకుంటూ వ్యాపారం చేస్తున్నారని స్థానికులు వాపోయారు. అది కూడా ట్రాక్టర్లతో తొలుకుంటామని అనుమతులు తీసుకుని భారీ ట్రిప్పర్లతో రాత్రింబవళ్లు మట్టిని తరలిస్తూర్నారని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెరువుమట్టి తరలింపును ఆపకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరించారు. స్థానికుల ఆందోళనకు ఎన్ఎస్యూఐ నాయకులు మద్దతిచ్చారు.
కడప అగ్రికల్చర్: రోజంతా టిప్పర్ల శబ్దాలే.. రోడ్డంతా గుంతలే.. ఇళ్లంతా దుమ్మూ ధూళే.. వీళ్ల పోరుకు సస్తాన్నాం.. అంటూ దేవునికడప వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుని కడపలో చెరవుమట్టిని తరలించొద్దని మంగళవారం ఆందోళన చేశారు. ట్రాక్టర్లతో కాకుండా భారీ వాహనాలతో మట్టిని తరలిస్తున్నారని ఆలా తరలించ వద్దని రోడ్డుపై అడ్డంగా నిలబడి నిరసన చేపట్టారు. నిబంధనలకు వ్యతిరేకంగా చెరువులో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు.
మట్టి తరలింపు వాహనల రాకపోకల కారణంగా పాతకడప నుంచి వాటర్ గండికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. భారీ వాహనాలతో మట్టిని తరలించడం వల్ల రోడ్లన్నీ గుంతలు పడటంతోపాటు దుమ్ముదూళంతా ఇళ్లలోకి వస్తోందని స్థానికులు వాపోయారు. దీంతోపాటు దుమ్ముకు దగ్గు, ఆయాసం వస్తోందని బాధ వ్యక్తం చేశారు. వాహనాల తాకిడి, శబ్థాలతో ఇళ్లలో ఉండలేక పోతున్నామని చెప్పారు. వాహనాల తాకిడికి పిల్లలు పాఠశాలకు పంపాలంటే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాలతో తమ పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని వాపోయారు. దీంతోపాటు ముసిలి, పెద్దవాల్లు రోడ్లపైన తిరగలేక పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం 20 రోజులుగా జరుగుతోందని, దీన్ని పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భారీ వాహనాలు నిత్యం ఆలయం మీదుగానే అధిక సంఖ్యలో వెళ్లుతుండటంతో భక్తులకు ఎంతో అసౌకర్యం కలుగుతుందని తెలిపారు.
దేవునికడప చెరువులోజోరుగా తవ్వకాలు
మట్టిని తరలించవద్దనిదేవుని కడపలోస్థానికుల ఆందోళన

మట్టికొట్టుకుపోవద్దు!