
4 నుంచి సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
నందలూరు: జిల్లాలో అత్యంత ప్రాశస్త్యం పొందిన ఆలయాలలో ఒకటైన సౌమ్యనాథ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు జూలై 4 నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. 13వ తేదీ వరకు 10 రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. 4న ఉద యం తిరుమంజనం, రాత్రి అంకురార్పణ, 5న ఉదయం ధ్వజారోహణం, రాత్రి యాలివాహనం, 6న ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంస వాహనం, 7న ఉదయం పల్లకీ సేవ, రాత్రి సింహవాహనం, 8న ఉదయం పల్లకీసేవ, రాత్రి హనుమంతు వాహనం, 9న ఉదయం శేష వాహనం, రాత్రి గరుడ వాహనం, 10న ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయని తెలిపారు. 11న ఉదయం కల్యాణోత్సవం, రాత్రి గజవాహనం, 12న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 13న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు.