
ఉచితంగా న్యాయ సాయం
రాయచోటి: కోర్టుల ద్వారా అందుతున్న ఉచిత న్యాయ సహాయా న్ని పేద, మధ్య తరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.బాబా ఫకృద్దీన్ తెలిపారు. ఏపీ న్యాయ సేవాధికార సంస్థ, వైఎస్సార్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు మంగళవారం రాయచోటి సబ్ జైలును సీనియర్ సివిల్ జడ్జి సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ జైలు లీగల్ ఎయిడ్ క్లినిక్, జైలు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో సమావేశమయ్యారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యత, జైలు లోపల ఖైదీల హక్కులను తెలియజేశారు. ఉచిత న్యాయ సాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్పై అవగాహన కల్పించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నంబర్ 15100పై వివరించారు. కార్యక్రమంలో రాయచోటి సబ్ జైలు సూపరింటెండెంట్, ప్యానల్ న్యాయవాది తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి పనుల తనిఖీ
సంబేపల్లె: మండల పరిధిలోని గుట్టపల్లె, ఎస్.సోమవరం గ్రామాల్లో మంగళవారం పీడీ వెంకటరత్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరుగుతున్న నీటి నిల్వ గుంతలు, హార్టికల్చర్, పిట్టింగ్ తదితర పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో బిల్లులు తదితర వివరాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఏపీఓ, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

ఉచితంగా న్యాయ సాయం