
ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో కడప జట్టు ఘన విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో మంగళవారం మూడో రోజు కడప జట్టు చిత్తూరు జట్టుపై ఘన విజయం సాధించింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు కోల్పోయి 12 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 30.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. దీంతో 329 పరుగులతో కడప జట్టు ఘన విజయం సాధించింది. చిత్తూరు జట్టులోని సోహన్రెడ్డి 47, సాయి చరణ్ 30 పరుగులు చేశారు. కడప జట్టులోని నాగకుళ్లాయప్ప 5 వికెట్లు, చరణ్ 4 వికెట్లు తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్లో కడప జట్టు 399 పరుగులు చేయగా చిత్తూరు 97 పరుగులకు ఆలౌట్ అయింది. కడప జట్టు రెండో ఇన్నింగ్స్లో 169 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
డ్రాగా ముగిసిన నెల్లూరు–కర్నూలు మ్యాచ్
వైఎస్ఆర్ఆర్ స్టేడియంలో జరిగిన నెల్లూరు–కర్నూలు మ్యాచ్ డ్రాగా ముగిసింది. మంగళవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 78.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 415 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని తోషిత్ యాదవ్ 155 బంతుల్లో 170 పరుగులు, మన్విత్రెడ్డి 106 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని నౌషన్ కళ్యాణ్ 3 వికెట్లు, మల్లికార్జున 2 వికెట్లు, విఖ్యాత్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 9 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా తొలి ఇన్నింగ్స్లో నెల్లూరు జట్టు 464 పరుగులు చేయగా కర్నూలు జట్టు 171 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో కడప జట్టు ఘన విజయం

ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో కడప జట్టు ఘన విజయం

ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో కడప జట్టు ఘన విజయం