
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
రాయచోటి జగదాంబ సెంటర్ : మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు 36 జీఓ అమలు చేయాలని రాయచోటి మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధ్యక్ష, కార్యదర్శులు అక్బర్, శంకరయ్య మాట్లాడుతూ పని గంటలు పెంచి కేవలం రూ.15 వేల వేతనం ఇస్తున్నారని పారిశుద్ధ్య కార్మికులతో పాటు రూ.21 వేలు వేతనం ఇవ్వాలన్నారు. వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచి ఆప్కాస్ కొనసాగించాలని లేదంటే పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల ధర్నాకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఫయాజ్బాషా, సలీం మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కార్మికులు దేవా, రమేష్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మీ, మౌనిక, రమణ తదితరులు పాల్గొన్నారు.