
జగన్ హయాంలోనే ముస్లింలకు పెద్దపీట
రాజంపేట: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాయాంలో ముస్లింలకు పెద్దపీట వేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆకేపాటి భవన్లో ఆకేపాటి, మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డిని రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ జాహిద్అలీ ఆధ్వర్యంలో ముస్లింలు సన్మానించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ముస్లింలకు అన్ని విధాలుగా అండగా నిలబడి, వారికి మేలు చేసే విధంగా పాలనను కొనసాగించారని గుర్తుచేశారు. అదే విధంగా ముస్లిం మైనార్టీలు వైఎస్సార్ కుటుంబానికి అండగా నిలబడుతూ వచ్చారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముస్లిం సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిందన్నారు. చంద్రబాబు మాయమాటలతో ప్రజలను మోసం చేశారన్నది ప్రజలు గుర్తించారన్నారు. మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనువాసులరెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు మేలు జరిగిందంటే అది దివంగత సీఎం వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే అని అన్నారు. రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ జావిద్అలీ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆకేపాటి, ఎంపీలు మిధున్రెడ్డి, మేడా రఘునాథరెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ పోలా కృషితో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో తనకు రాష్ట్రస్ధాయిలో పార్టీలో పదవి లభించిందన్నారు. ఇందుకు వారికి రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మసూద్అలీఖాన్, నియోజకవర్గ అధ్యక్షుడు ఖాజా, మున్సిపాలిటీ వైస్చైర్మన్ మునాఫ్, సర్పంచ్ మౌలాలి, నాసిర్, ముస్లిం పెద్దలు నజీర్ అహ్మమద్, షపీ, సత్తార్ఖాన్, ఇలియాస్, సిద్దిక్, మొహమ్మద్షరీఫ్, మౌలా,హనీఫ్, షాకీర్, ఏజాజ్, బషీర్, అన్వర్, అక్డార్, ఖాదర్బాష, రఫీ, మొహమ్మద్అలీ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి