3 కేజీల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

3 కేజీల గంజాయి స్వాధీనం

Jun 1 2025 12:18 AM | Updated on Jun 1 2025 12:18 AM

3 కేజీల గంజాయి స్వాధీనం

3 కేజీల గంజాయి స్వాధీనం

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కడప నగరంలో గంజాయి కలిగి ఉన్న ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కడప ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణకుమార్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ నీలకంఠేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం కడప ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కడప పాత బస్టాండులోని రవీంద్రనగర్‌ బ్రిడ్జి వద్ద గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారంతో తమ సిబ్బందితో కలిసి పదాడి నిర్వహించామన్నారు. పఠాన్‌ బిలాల్‌ అహ్మద్‌, సయ్యద్‌ మహబూబ్‌ బాషా, షేక్‌ అర్షద్‌, సయ్యద్‌ మహమ్మద్‌ ఉమర్‌, షేక్‌ మహ్మద్‌ రఫీ అనే ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి మూడు కేజీల గంజాయితో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించామన్నారు. ఈ ఐదుగురిలో ఒక్కొక్కరిపై ఒడిస్సా రాష్ట్రం, కడప వన్‌టౌన్‌, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే పలు గంజాయి కేసులు ఉన్నాయన్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న పఠాన్‌ బిలాల్‌ అహ్మద్‌ భవన నిర్మాణ కూలీగా, సయ్యద్‌ మహబూబ్‌ బాషా, షేక్‌ అర్షద్‌ టీ హోటల్‌లో మాస్టర్‌గా, సయ్యద్‌ మహ్మద్‌ ఉమర్‌ ఏసీ మెకానిక్‌గా, షేక్‌ మహ్మద్‌ రఫీ వస్త్ర దుకాణంలో పని చేస్తూ గంజాయి విక్రయాలు సాగిస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఎస్‌ఐలు టి. మహేంద్ర, నరసింహారావు, సతీష్‌ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యాశాస్త్రంపై అవగాహనతోనే విజయాలు

కడప కల్చరల్‌ : విద్యా శాస్త్రంపై అవగాహనతోనే మానవాళికి విజయాలు దక్కగలవని నోబెల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు రవీంద్ర అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 15 రోజులుగా జరుగుతున్న వేసవి వినోదం శిక్షణా శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలల భవిష్యత్తు సమాజ అవసరాలతో ముడిపడి ఉందన్నారు. సాంకేతిక, సాంస్కృతిక అవసరాల రీత్యా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆకాంక్షిచారు. జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల బయన్న మాట్లాడుతూ వేసవి శిక్షణా శిబిరాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, పరిశీలనాత్మక శక్తులను పెంచడంలో తోడ్పడగలవన్నారు. విజ్ఞానాన్ని సరదాగా ఎలా నేర్చుకోవచ్చో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజాద్‌ అలీ తెలిపారు. శిబిరంలో విద్యార్థులకు పలు శాసీ్త్రయ ప్రయోగాలు, చిత్రలేఖనం, పాటలు, మ్యాజిక్‌, ఓరిగామి తదితర అంశాలలో పోటీలు నిర్వహించారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేవీవీ సీనియర్‌ నాయకుడు వెంకటేశ్వర్లు, ఐద్వా జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బమ్మ , రిసోర్స్‌ పర్సన్స్‌ ప్రసాద్‌ రెడ్డి, శిరీష, రంగనాయకులు, కామేశ్వరమ్మ, గఫూర్‌, సమీర్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్య

– అదనపు కట్నం వేధింపులే కారణం

ధర్మవరం అర్బన్‌ : అదనపు కట్నం కోసం అత్తింటివారు పెడుతున్న వేధింపులు భరించలేక వివాహిత తన పుట్టింటిలో ఆత్మహత్య చేసుకుంది. ధర్మవరం టూటౌన్‌ సీఐ రెడ్డప్ప వివరాల మేరకు... వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లి మండలానికి చెందిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల లెక్చరర్‌ చిన్న నరసింహులుకు ధర్మవరంలోని శాంతినగర్‌కు చెందిన భాగ్యలక్ష్మి(31)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెళ్లయిన కొంతకాలం తర్వాత నుంచి అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు సుబ్బమ్మ, పెద్ద నరసింహులు వేధించడం మొదలు పెట్టారు. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు కూడా చేశారు. అయినా మెట్టినింటి వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో భాగ్యలక్ష్మి 20 రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. మనోవేదనకు గురైన భాగ్యలక్ష్మి శనివారం ఇంట్లోనే ఉరివేసుకుంది. మృతురాలి తల్లి కొండమ్మ ఫిర్యాదు మేరకు మెట్టినింటి వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement