అరుణాచలానికి ప్రత్యేక బస్సు | - | Sakshi
Sakshi News home page

అరుణాచలానికి ప్రత్యేక బస్సు

Jun 7 2025 1:34 AM | Updated on Jun 7 2025 1:34 AM

అరుణా

అరుణాచలానికి ప్రత్యేక బస్సు

రాయచోటి జగదాంబసెంటర్‌: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అరుణాచలానికి పౌర్ణమి పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీన ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించినట్లు రాయచోటి ఆర్టీసీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తేదీ ఉదయం 9 గంటలకు బద్వేల్‌ ఆర్టీసీ బస్టాండు నుంచి బస్సులు నడపనుండగా కడపలో 10.30 గంటలకు బయలుదేరుతుందన్నారు. రాయచోటిలో బంగ్లా బస్టాప్‌ నుండి 11.45 గంటలకు బస్సు బయలుదేరుతుందని తెలిపారు. రాయచోటి నుంచి చార్జీ రూ.1050 ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని రాయచోటి పరిసర ప్రాంతాల భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పనులు శరవేగంగా

పూర్తి చేయాలి

రాజంపేట: రాజంపేట రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులను గుంతకల్‌ రైల్వే డివిజనల్‌ మేనేజరు చంద్రశేఖర్‌గుప్తా శుక్రవారం పరిశీలించారు. తిరుపతికి వెళుతూ మార్గఽమధ్యలో అమృత్‌భారత్‌ కింద జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు.పనులు నత్తనడకలో జరుగుతున్నాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే డీఆర్‌ఎం పరిశీలించినట్లు రైల్వే వర్గాలు అంటున్నాయి.

పారా స్పోర్ట్స్‌లో

విద్యార్థినుల ప్రతిభ

మదనపల్లె సిటీ: పారా స్పోర్ట్స్‌లో నవోదయ విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. ఇటీవల జాతీయ స్థాయిలో గుజరాత్‌, కర్నాటక రాష్ట్రాలతో పాటు థాయ్‌లాండ్‌లో ఆదిత్య మెహత ఫౌండేషన్‌, నవోదయ విద్యాలయ సమితి సంయుక్తంగా పోటీలు నిర్వహించారు. ఇందులో దివ్యాంగురాళ్లయిన శివాని, చందన రాణించారు. షాట్‌పుట్‌ విభాగంలో శివాని మూడు బంగరుపతకాలు, ఒక కాంస్యం పతకం సాఽధించింది. 100 మీటర్ల పరుగు పందెంలో ఒకటి, జావలిన్‌త్రోలో నాలుగు బంగారు పతకాలు దక్కించుకుంది. కె.చందన హ్యాండ్‌ సైక్లింగ్‌ విభాగంలో గోల్డ్‌మెడల్‌ సాధించింది .వీరిని విద్యాలయంలో శుక్రవారం ప్రిన్సిపాల్‌ ఎం.గీత, వైస్‌ ప్రిన్సిపాల్‌ వేలాయుధన్‌,అధ్యాపకులు అభినందించారు. నవోదయ విద్యాలయ హైదరాబాదు రీజియన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ గోపాలకృష్ణ సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు.

జలజీవన్‌ మిషన్‌

పనుల పరిశీలన

పెద్దమండ్యం: జలజీవన్‌ మిషన్‌(జేజేఎం) ద్వారా చేపట్టిన పనులను కేంద్ర బృందం సభ్యులు శుక్రవారం పరిశీలించారు. మండలంలోని బండమీదపల్లె గ్రామ సచివాలయం వద్ద గ్రామ సర్పంచ్‌ మొలక బయ్యారెడ్డి అధ్యక్ష్యతన గ్రామసభ నిర్వహించారు. 2021లో జేజేఎం ద్వారా చేపట్టిన పనుల వివరాలను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వివరించారు. జేజేఎం ద్వారా చేపట్టిన పనులపై విలేజ్‌వర్క్స్‌ శానిటేషన్‌ కమిటీ (వీడబ్ల్యూఎస్‌సీ) సభ్యుల పర్యవేక్షణపై కేంద్ర బృందం నోడల్‌ అధికారి ఆరా తీశారు. ప్రతి ఇంటికి తాగునీటిని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జలజీవన్‌ మిషన్‌ను తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర బృందం నోడల్‌ అధికారి శిశ్యపాల్‌సేథి, డీఆర్‌ఈవో ప్రసన్నకుమార్‌, ఈఈ రషీద్‌ఖాన్‌, డిఈ చంద్రశేఖరరెడ్డి, ఎంపీడీవో శ్రీధర్‌రావు, ఏఈ అశోక్‌కుమార్‌, వెలిగల్లు సర్పంచ్‌ సి సరస్వతి, పంచాయతీ కార్యదర్శి శైలజ, వీడబ్ల్యూఎస్‌సీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అరుణాచలానికి ప్రత్యేక బస్సు 1
1/3

అరుణాచలానికి ప్రత్యేక బస్సు

అరుణాచలానికి ప్రత్యేక బస్సు 2
2/3

అరుణాచలానికి ప్రత్యేక బస్సు

అరుణాచలానికి ప్రత్యేక బస్సు 3
3/3

అరుణాచలానికి ప్రత్యేక బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement