
ప్రశాంతంగా ప్రారంభమైన డీఎస్సీ పరీక్ష
రాయచోటి/మదనపల్లె సిటీ: ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ ఆన్లైన్ పరీక్ష శుక్రవారం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది.జిల్లాలోని ఆరు కేంద్రాలలో రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించారు. మదనపల్లె డివిజన్ పరిధిలో మూడు, రాయచోటిలో రెండు, రాజంపేటలో ఒక కేంద్రంలో పరీక్ష జరిగింది. ఉదయం,సాయంత్రం రెండు సెషన్స్కు సంబంధించి 1363 మంది అభ్యర్థులకు 1137 మంది హాజరుకాగా 226 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ శ్రీధర్,డీఈఓ సుబ్రమణ్యం, మదనపల్లెలో ఎంఈఓ ప్రభాకర్రెడ్డి పరీక్షలను పర్యవేక్షించారు.