నిబంధనలు పాటించకపోతే బస్సులను సీజ్‌ చేస్తాం | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటించకపోతే బస్సులను సీజ్‌ చేస్తాం

Jun 11 2025 8:46 AM | Updated on Jun 11 2025 8:46 AM

నిబంధనలు పాటించకపోతే బస్సులను సీజ్‌ చేస్తాం

నిబంధనలు పాటించకపోతే బస్సులను సీజ్‌ చేస్తాం

పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమవుతున్న దృష్ట్యా పిల్లల సురక్షిత ప్రయాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ క్రమంలో బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అ్నమయ్య జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం స్పందించి బస్సులను కండీషన్‌లో ఉంచుకోవాలి. వాహనాలకు సంబంధించి ఏ పత్రం లేకున్నా, నడిపినా చర్యలు తీసుకోవడంతోపాటు జప్తు చేస్తాం. ఇదే విషయంపై అన్ని కళాశాలల యాజమాన్యాలకు నోటీసుల ద్వారా తెలియపరిచాం. స్కూల్‌ బస్సు డ్రైవర్లకు ఐదు సంవత్సరాలు భారీ వాహనం నడిపిన అనుభవం ఉండాలి. ప్రతి పాఠశాల బస్సుకు డ్రైవర్‌తోపాటు ఒక సహాయకుడు తప్పనిసరిగా ఉండాలి. బస్సు కండీషన్‌లో ఉండటమే కాకుండా బ్రేక్‌ వేసినప్పుడు నాలుగు దిక్కులా పార్కింగ్‌ లైట్లు వెలిగేలా చూసుకోవాలి. ప్రథమ చికిత్స బాక్స్‌, ఫైర్‌, అత్యవసర ద్వారాలు ఉండాలి. చిన్నపిల్లలు బస్సు ఎక్కేలా మెటికలు కింది భాగంలో అదనంగా మరో మెట్టు అమర్చుకోవాలి. కిటికీలకు ఇరువైపులా నాలుగు వరుసల పైపులు, పిల్లలు తలలు బయటపెట్టి చూడకుండా జాలి కట్టాలి. వాహనం వేగంగా నడిపినా, అజాగ్రత్తగా వ్యవహరించినా, సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడిపినా డ్రైవర్‌పై చర్యలు తీసుకునేలా పేరెంట్స్‌ కమిటీ ద్వారా బస్సులో ఫిర్యాదుల బాక్స్‌ ఏర్పాటు చేయాలి. బస్సుకు ముందు, రెండువైపులా పాఠశాల, కళాశాలల పేర్లు, సెల్‌ఫోన్‌ నెంబర్లు విధిగా రాయాలి. – అశోక్‌ ప్రతాప్‌ రావ్‌,

అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి రవాణా అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement