హమ్మయ్యా.. రైలు ఆగింది! | - | Sakshi
Sakshi News home page

హమ్మయ్యా.. రైలు ఆగింది!

Jun 11 2025 8:46 AM | Updated on Jun 11 2025 8:46 AM

హమ్మయ్యా.. రైలు ఆగింది!

హమ్మయ్యా.. రైలు ఆగింది!

రాజంపేట: ఆధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి దేశరాజధానికి రాజంపేట, నందలూరు, కడప మీదుగా నడిచే ఏపీ సంపర్క్‌ క్రాంతి రైలు(12708/12707) పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో ఎట్టకేలకు బుధవారం నుంచి ఆగనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ ఎ.శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు హాల్టింగ్‌కు పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డి, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డితోపాటు ఎమ్మెల్సీలకు రైల్వేశాఖ ఆహ్వానపత్రాలను అందజేసింది.

నాడు వైఎస్సార్‌తో ఢిల్లీ రైలు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి దృష్టి ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలుపై పడింది. ఈ రైలును ఆధ్యాతిక నగరం తిరుపతి నుంచి పార్లమెంటరీ కేంద్రాలైన రాజంపేట, కడప మీదుగా సికింద్రాబాదు వరకు నడిపించాలని రైల్వేమంత్రిత్వ శాఖను కోరారు. 2007లో ఈ రైలు తిరుపతి నుంచి సికింద్రాబాదు టు ఢిల్లీకి నడిచింది. తిరుపతి నుంచి రేణిగుంట, రాజంపేట, నందలూరు, కడప , గుత్తి, డోన్‌, కర్నూలు, మహబూబ్‌నగర్‌ మీదుగా పొడిగించారు.

నేటి నుంచి ఏపీ సంపర్క్‌క్రాంతికి రాజంపేటలో హాల్టింగ్‌

ఒకటిన్నర దశాబ్ధం తర్వాత నెరవేరిన కల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement