
● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు శుద్ధజలం
● ఫీజుల బాదుడు
ప్రభుత్వ విద్యా విధానాల వల్ల పాఠశాలల్లో ప్రమాణాలు దిగజారడంతో విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలకు తీసుకెళ్తున్నారు. ఇదే అదనుగాప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు ఫీజులను భారీగా పెంచేశాయి. ఏడాది సగటున 10 నుంచి 30 శాతానికి పైగా స్కూల్ ఫీజులు పెంచేయడంతో పేద మధ్య తరగతి వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది.
● రాయచోటిలోని శ్రీ చైతన్య స్కూల్లో గత ఏడాది 5వ తరగతికి ఫీజు రూ.30వేలు, పుస్తకాలకు రూ. 7,500, అడ్మిషన్ నగదు రూ.2 వేలు( మొత్తం రూ.39,500) వసూలు చేశారు. ఈ ఏడాది స్కూల్ ఫీజును రూ.50 వేలు చేశారు. పుస్తకాలకు రూ.8,500 కట్టించుకున్నారు. రిజర్వ్ నగదు తో కలిపి రూ 60,500 వసూలు చేస్తున్నారు. ఇదే పరిస్థితి ఏ పాఠశాలకు వెళ్లినా కనిపిస్తోంది.
రాయచోటి: ఏడాదిలోనే ఎంత తేడా కనిపిస్తోంది.. గత ఐదు సంవత్సరాల పాలనలో విద్యావ్యవస్థ ప్రగతి బాటలో నడవగా ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారిందంటూ విద్యార్థులు తల్లిదండ్రులు మదన పడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక విప్లవంలా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లగా... కూటమి సర్కార్ కుప్ప కూల్చింది.. నాడు –నేడు అభివృద్ధి పనులు అటకెక్కాయి. సర్కారు చదువులు చట్టు బండలవుతున్నాయి. తల్లికి వందనమన్న ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో ఒక్క రూపాయి వేయలేదు. ఇంగ్లీష్ మీడియానికి మంగళం పాడారు.. డిజిటల్ క్లాస్ రూమ్కు బై బై అన్నారు.. సబ్జెక్టు టీచర్లపై వేటు వేశారు. గోరుముద్దను ఘోరంగా మార్చారు. ఆసాంతం విద్యా వ్యవస్థను నీరు గార్చారు. ఫలితంగా ఫలితాలు దారుణంగా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపు చూడకుండా ప్రైవేట్ పాఠశాలల బాట పడుతున్నారు.
● వైఎస్ జగన్ పాలనలో సమూల విద్యా సంస్కరణలు ఉద్యమంలా సాగాయి. నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విరాజిల్లాయి. ఖాళీలు లేక ‘నో వేకెన్సీ’బోర్డులు పెట్టే వరకు వెళ్లాయి. కూటమి పాలనలో సంస్కరణలు నిలిచిపోయి సంక్షేమ పథకాలు అమలు కాక నాటి పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. జిల్లాలో 40 రోజుల విరామం తర్వాత గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నాయి.
● ఏడాది కిందటి వరకు ఎంతో గొప్ప ఫలితాలతో ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి నేడు దిగజారిపోయింది. వైఎస్సార్సీపీ పాలనలో మనబడి నాడు–నేడు పనులతో సకల సదుపాయాలతో వెలుగందిన బడులు నేడు జీవం కోల్పోయాయి. రికార్డు వ్యవధిలో ఫలితాలు అంటూ ఘనంగా చెప్పుకున్న పదో తరగతి ఫలితాల్లోనే ఈ ప్రభుత్వం డొల్లతనం బయటపడింది. జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో తప్పులు దొర్లడంతో ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే చెల్లింది.
● మోడల్ స్కూళ్ల పేరుతో ప్రాథమిక పాఠశాలలను దూరంగా ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడంతోనే ప్రభుత్వం పనితీరు తేటతెల్లమైంది. సర్కారీ బడుల్లో ప్రమాణాలను పెంచే పనులను పక్కన పెట్టడంతోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుకు మోజు చూపిందన్నది స్పష్టమైంది. ఇదే అదునుగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ చెలరేగి పోతున్నారు. ఒక్క స్కూల్ లో సగటున 10 నుంచి 30 శాతం పైగా ఫీజులు పెంచేశారు. 2024 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు అత్యధిక మార్కులతో టాపర్లుగా నిలిచారు. ఈ ఏడాది అధిక శాతం ప్రైవేట్ విద్యార్థులు జిల్లా నుంచి ఆ స్థానంలో నిలిచారు. దీంతో ‘షైనింగ్ స్టార్‘ అవార్డులు ప్రైవేట్ పాఠశాలల వారికే దక్కాయి.
పాడుబడిన భవనాలు
వైఎసాసర్సీపీ పాలనలో నాడు–నేడు కార్యక్రమంతో ఒక వెలుగు వెలిగిన పాఠశాలలు నేడు కళావిహీనంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా పక్కన పెట్టింది. దీంతో గదులు పాడుబడ్డాయి. పాఠశాల ఆవరణ చెత్తాచెదారంతో నిండిపోయింది. టాయిలెట్స్ వైపు వెళ్లలేని పరిస్థితులు. చాలా బడుల్లో ఏర్పాటు చేసిన బోరుబావులు, నీటి ట్యాంకులు పనికిరాకుండా పోయాయి. దాతలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి ప్లాంట్లు పనికి రాకుండా పోయాయి. 90 శాతంపైగా పనిచేయడం లేదని సమాచారం.
పూర్తికాని బదిలీలు.
జిల్లా పరిధిలో ఉపాధ్యాయుల బదిలీలు ఇంకా పూర్తి కాలేదు. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు మాత్రమే నేటి వరకు పూర్తికాగా.. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు జరగలేదు. దీంతో అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. విద్యార్థులు లేని చోట ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల పాఠశాల ప్రారంభంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.
● నేటినుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నా విద్యార్థులకు అందాల్సిన బుక్స్, యూనిఫామ్, బూట్లు, సాక్షులు, కిట్లు, బ్యాగుల కొరత ఉన్నట్లు సమాచారం.
నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం
పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు..
అసంపూర్తిగా తరగతి, టాయిలెట్స్ నిర్మాణాలు..
యూనిఫామ్, బూట్లు, సాక్సులు పెండింగ్
బ్యాగుల కొరత..
పని చేయని ఆర్వో ప్లాంట్లు
విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వం
గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నాయి. ప్రారంభం రోజునే విద్యార్థులకు బుక్స్, బ్యాగులు, యూనిఫామ్ అందివ్వాలని ఆదేశించాం. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నా, అధికంగా ఉన్న వాటిని వెంటనే పరిశీలించి..అక్కడికి ఉపాధ్యాయులను పంపే చర్యలు చేపడతాం.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రారంభం రోజు నుంచే పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించాం. –సుబ్రహ్మణ్యం,
జిల్లా విద్యాశాఖాధికారి
మదనపల్లె సిటీ: నాడు–నేడు కింద గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులకు శుద్ధ జలం అందేది. ఆర్ఓ ప్లాంట్లు విద్యార్థులకు ఉపయోగపడ్డాయి. నాడు–నేడు మొదటి ఫేస్లో 600, రెండో ఫేస్లో 1016 పాఠశాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో సుమారు 1000 వరకు ప్లాంట్లు మర్మమ్మతులకు గురికావడంతో పని చేయడం లేదు. కూటమి ప్రభుత్వం దీని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.

● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు శుద్ధజలం

● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు శుద్ధజలం

● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు శుద్ధజలం

● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు శుద్ధజలం