
రైతాంగం అభివృద్ధికి కృషి
రాయచోటి: జిల్లాలో ఎనలేని అభివృద్ధి జరిగిందని రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో మంత్రి కలెక్టర్ ఛామకూరి శ్రీధర్తో కలిసి జిల్లా వ్యాప్తంగా పూర్తయిన పనుల ప్రారంభోత్సవం, నూతన పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతాంగం అభివృద్దికి కృషి చేయన్నట్లు చెప్పారు. రాయచోటి ప్రాంతంలో ఎక్కువ మంది మామిడిసాగుపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరందరికీ గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్ రావు, ఆర్అండ్బి ఎస్ఈ వాసుదేవరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ సైనిక సంఘం అధ్యక్షుడిగా దాసరి రమణయ్య
కడప అర్బన్: ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా మాజీ సైనిక సంఘం నూతన అధ్యక్షుడిగా సుబేదార్ దాసరి రమణయ్యను ఎన్నుకున్నారు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం వద్ద బుధవారం వైఎస్సార్ కడప జిల్లా మాజీ సైనికుల సంఘం (డీఈఎస్ఎంఏ) సమావేశం నిర్వహించారు. గతంలో మాజీ సైనిక సంఘం అధ్యక్షుడిగా ఉన్న పువ్వాడ లక్ష్మీనారాయణ ఈ ఏడాది మార్చి 19న మరణించారు. ఆయన స్థానంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాజీ కెప్టెన్ ఎస్.ఎస్. రాముడు, మాజీ వారెంట్ ఆఫీసర్ బి.వి.రంగయ్య, ప్రధాన కార్యదర్శి బి.వి. గోపాల్రెడ్డి, ఇతర మాజీ సైనికులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి
రాయచోటి: వాహనదారులు రోడ్డు భద్రతా ప్రమాణాలను తప్పక పాటించాలని జిల్లా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు) కోరారు. బుధవారం రాయచోటిలో జిల్లా రవాణా అధికారి డి అశోక్ ప్రతాప్ సూచనల మేరకు చిత్తూరు రోడ్డు జంక్షన్లో ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ను వినియోగించాలన్నారు. అతివేగం, ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు విధించాల్సిన జరిమానాలగురించి తెలియజేశారు. ఈ సందర్భంగా రోడ్డు సిగ్నల్స్, భద్రత జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను ద్విచక్ర వాహనదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంవీఐలు బి సుబ్బరాయుడు, జెఅనీల్ కుమార్, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
మామిడికి గిట్టుబాటుధర కల్పించాలని ధర్నా
రాజంపేట: మామిడిరైతులకు గిట్టుబాటుధర కల్పించాలని బుధవారం రాజంపేట వ్యవసాయ మార్కెట్యార్డులో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు సంఘంనేతలు పందికాళ్ల మణి, చిట్వేలి రవి మాట్లాడుతూ మామిడిరైతులను ఆదుకోవాలని, ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకోవాలన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రైవేటు మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీలు దాదాపు 200 ఉన్నాయ న్నారు. వారు సిండికేట్గా ఏర్పడి గతంలో ఉన్న ధరల కన్నా సగానికి తగ్గించి వేశారన్నారు. వీటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చిత్తూరు కలెక్టర్ తోతాపూరి కేజీ రూ. 12గా ధర నిర్ణయించారన్నారు. ఆ ధర అమలు కావడంలేదన్నారు. ఈ ఏడాది మామిడికాపు తక్కువగా ఉందని, ధర పెరగాల్సి ఉందన్నారు. దళారులు, జూస్ ఫ్యాక్టరీ యజమానులు ధర పెట్టడంలేదన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నేతలు హరిప్రసాద్, బొజ్జ శివయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతాంగం అభివృద్ధికి కృషి

రైతాంగం అభివృద్ధికి కృషి

రైతాంగం అభివృద్ధికి కృషి