
పట్టాలు తప్పిన ప్రొటోకాల్!
రాజంపేట: పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట రైల్వేస్టేషన్లో బుధవారం ఏపీ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ హాల్టింగ్(అదనపుస్టాపేజ్) సభ నిర్వహణ విషయంలో పాటించాల్సిన ప్రొటోకాల్ను రైల్వేశాఖ పట్టాలు తప్పించిందనే ఆరోపణలు రైల్వే వర్గాల నుంచి వినిపించాయి. ప్లాట్ఫాంలో కడప వైపు ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ జకియాఖాన్ను పిలిచారు. తర్వాత ఆహ్వాన పత్రికలో పేర్కొన్న ప్రజాప్రతినిధులు పేర్లు కూడా కనీసం ఉచ్ఛరించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆహ్వానించిన వారు కొన్ని అనివార్యకారణాల వల్ల రాలేకపోయినప్పటికీ, ప్రొటోకాల్ రీతిలో అధికారులు ప్రస్ఫుటించలేకపోవడం విమర్శలకు దారితీసింది. విధిలేని పరిస్థితిలో రైల్వే అధికారులు ప్రోటోకాల్ను పక్కనపెట్టేసి, బీజెపీ నేతలు సాయిలోకేశ్, రమేష్నాయుడు, టీడీపీ నేత చమర్తి జగన్మోహన్రాజును వేదికను ఎక్కించేశారు. అక్కడి నుంచి వేదిక పూర్తిగా కూటమిపార్టీ సభగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. అందరి చేతికి పచ్చజెండాలు ఇచ్చేశారు. రైలును కదిలించారు. వేదిక సాక్షిగా సన్మానాలు, సత్కారాలు చేసేసుకున్నారనే విమర్శలు వచ్చాయి. రైల్వేఅధికారులు అందరికి మాట్లాడే అవకాశం ఇస్తే ప్రొటోకాల్ రగడ రాజుకుంటుందని, ఒక్క మంత్రికే మాట్లాడే అవకాశం కల్పించడం గమనార్హం.
ఢిల్లీ రైలు హాల్టింగ్కు పచ్చజెండా
ఢిల్లీకి వెళ్లే ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్(12707/12708) రైలుకు రాష్ట్ర రవాణాశాఖమంత్రి మండిపల్లె రాంప్రసాద్రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈయనతోపాటు ఎమ్మెల్సీ జకియాఖాన్, గుంటూరు డీఆర్ఎం సుధేష్ణసేన్, డివిజన్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజంపేట నుంచి దేశ రాజధానికి ప్రత్యక్ష అనుసంధాన్ని అందించే మొదటిరైలు ఇదే అని అనన్నారు. రాజంపేట స్టేషన్ నుంచి తిరుపతి, కాచిగూడ, నాగ్పూర్, బోఫాల్, ఢిల్లీ వంటి నగరాలకు సౌకర్యవంతమైన ప్రయాణం సులభతరం చేస్తుందన్నారు.గుంటూరు డీఆర్ఎం సుధేష్ణసేన్ మాట్లాడుతూ అమృత్భారత్ కింద రాజంపేట రైల్వేస్టేషన్ను దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
రైల్వేఅధికారులనుదారితప్పించిన పచ్చపెత్తనం
ఢిల్లీ రైలుహాల్టింగ్ సభావేదికపై కూటమినేతలు

పట్టాలు తప్పిన ప్రొటోకాల్!