
ఫీజు ఫోరు వాయిదా
రాయచోటి: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టే ఫీజుపోరు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు కిషోర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గుజరాత్లో సంభవించిన విమాన ప్రమాదం దృష్ట్యా ఫీజు పోరు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ప్రకటన మేరకు తర్వాత నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని విద్యార్థి విభాగాల నాయకులు, విద్యార్థి సంఘాలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
17న జాబ్మేళా
రాయచోటి జగదాంబసెంటర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం రాయచోటిలోని శ్రీ షిరిడీ సాయి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 17న ఉద్యోగమేళా జరగనుంది. ఈ విషయాన్ని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెట్రో ల్యాబ్స్, అపోలో ఫార్మసీ, ఎస్బీఐ కార్డ్స్, హీరో మోటో కార్ప్, ముత్తూట్ ఫైనాన్స్ తదితర కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 9177143181, 9550104360, 889777636 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మదనపల్లె సిటీ: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో నిర్వహించిన పెయింటింగ్ పోటీల్లో మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని బేబి హాసిని ప్రథమ స్థానం దక్కించుకుని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. గురువారం జిల్లా కేంద్రం రాయచోటిలో జరిగిన పోటీలో ప్రతిభ కనబరిచింది. హాసిని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వతరగతి చదువుతుంది. ఈనెల 20వతేదీ విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనన్నుట్లు పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్, యోగా ట్రైనర్ నరేష్బాబు తెలిపారు. హాసిని ఎంపిడిఓ తాజ్ మస్రూర్, పంచాయతీ కార్యదర్శి పవన్, ఉపాధ్యాయులు అభినందించారు.
వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి
కడప అగ్రికల్చర్: జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ పేర్కొన్నారు. ఆయన గురువారం జిల్లా వ్యవసాయ అధికారిగా కడప కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఆయనకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.
దేవదాయ అధికారులకు లోకాయుక్త నోటీసులు
ప్రొద్దుటూరు : దేవదాయ శాఖ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్తోపాటు ఈఓలకు ఈనెల 3వ తేదీన లోకాయుక్త నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణ గీతాశ్రమంలో చోటు చేసుకున్న అవినీతిపై సమాధానం చెప్పాలని లోకాయుక్త కోరింది. గీతాశ్రమంలోని ఈఓ కార్యాలయంలో అటెండర్గా పని చేసిన బి.జనార్ధన్రెడ్డికి ఈఓ రామచంద్రాచార్యులు వేతన రూపంలో రూ.5 లక్షలు చెల్లించారు. గీతాశ్రమం నిర్వహణకు సంబంధించిన డబ్బును ఇందుకోసం వినియోగించారు. గతంలో ఇదే కార్యాలయంలో పని చేసిన జనార్ధన్రెడ్డి ప్రవర్తన సరిగా లేకపోవడంతో.. ఆశ్రమ నిర్వాహకుడిగా ఉన్న గంగాధరానంద గిరి స్వామి తొలగించారు. 2021 జూలై నుంచి జనార్ధన్రెడ్డి విధులకు హాజరు కాకపోగా.. రోజూ కార్యాలయ పరిసరాలకు వచ్చి గూగుల్ ద్వారా ఫొటోలు తీసుకుని కోర్టును ఆశ్రయించాడు. తాను రోజు విధులకు హాజరవుతున్నానని తెలిపాడు. కోర్టు నోటీసు మేరకు గతంలో పని చేసిన దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్లాల్.. జనార్ధన్రెడ్డి ప్రవర్తన సరిగా లేని మాట వాస్తవమేనని, గంగాధరానందగిరి స్వామి ఇచ్చిన లేఖను సమర్పిస్తూ కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి జనార్ధన్రెడ్డికి, గీతాశ్రమానికి సంబంధాలు లేవు. కాగా ఇటీవల ఈఓ రామచంద్రాచార్యులు అతనికి లీజు బకాయిలు ఉన్నాయని చెప్పి రూ.5 లక్షలు చెల్లించడం జరిగింది. విధులకు రాని వ్యక్తికి రూ.5 లక్షలు దేవదాయ శాఖ సొమ్మును ఎలా చెల్లిస్తారని, దీనిపై విచారణ జరిపి ఆ డబ్బును తిరిగి ప్రభుత్వానికి జమ చేయాలని కోరుతూ పర్లపాడు గౌరీశంకర్ అనే వ్యక్తి లోకాయుక్తలో పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు దేవదాయశాఖ అధికారులకు లోకాయుక్త నోటీసులు అందాయి. ఏకంగా కమిషనర్ ఉత్తర్వులను కాదని ఈఓ రామచంద్రాచార్యులు అప్పనంగా జనార్ధన్రెడ్డికి డబ్బు చెల్లించడం చర్చనీయాంశంగా మారింది.

ఫీజు ఫోరు వాయిదా