
యోగాతో ఆరోగ్యం పదిలం
గాలివీడు: ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని డీఆర్వో మధుసూదన్రావు తెలిపారు. మెగా యోగా క్యాంపెయిన్ లో భాగంగా ఉపాధి హామీ పీడీ వెంకటరత్నం,ఆర్డీఓ శ్రీనివాసులు, జిల్లా టూరిజం డెవలప్మెంట్ ఆఫీసర్ నాగభూషణంతో కలసి కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం మండలం లోని వెలిగల్లు ప్రాజక్ట్ పార్క్ లో అధికారులు, ప్రజలతో కలసి యోగాసనాలు వేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను నిరంతర అభ్యాసంగా మార్చుకోవాలన్నారు. యోగా సాధనతో మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల అధికారులు, సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.