
●మార్కెట్ దత్తత ఒట్టిదే
మదనపల్లె టమాట మార్కెట్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో జరిగిన పాదయాత్రలో పదేపదే ప్రకటించారు. మదనపల్లె రూరల్ మండలం సీటీఎం వద్ద 500 కిలోమీటర్ల శిలాఫలకం ఆవిష్కరించగా అందులోనూ టమాట రైతులను ఆదుకుంటామని హామీలను రాశారు. ధరలు పడిపోతున్నాయి, పెట్టిన పెట్టుబడి రావడం లేదు, దళారులు దోచుకుతింటున్నారని వాపోయారు. దీనిపై అధికారంలోకి వచ్చాక మదనపల్లె మార్కెట్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా, టమాట ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అవేవీ అమలు కాలేదు. టమాట ధరలు పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం ప్రభుత్వానికి తెలుసు. అయినా హామీలు అమలు చేసి రైతులను ఆదుకోవాలన్న ఆలోచన లేదు.