
ప్రజలకు నష్టం కలగకుండా బ్లాస్టింగ్ నిర్వహించాలి
ఓబులవారిపల్లె: రైతులు, ప్రజలను అప్రమత్తం చేసి వారికి ఎటువంటి నష్టం జరగకుండా మైన్లో బ్లాస్టింగ్ నిర్వహించాలని డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అండ్ సేప్టీ కిషోర్ కుమార్ అన్నారు. మంగంపేట ఏపీఎండీసీ గనుల్లో నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని రైతులు, గ్రామస్తుల ఫిర్యాదు చేయడంతో నెల్లూరు డీడీఎంఎస్ వారు గురువారం గనుల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మంగంపేట ఏపీఎండీసీ గనులు విస్తరించడం ద్వారా బ్లాస్టింగ్ సామర్థ్యాన్ని పెంచడంతో పెద్ద శబ్దాలతో భూమి కంపించడంతో పొలాల వద్ద పనిచేసుకోవాలంటే భయమేస్తుందన్నారు. అనంతరం కిషోర్ కుమార్ మాట్లాడుతూ మంగంపేట గనుల సమీపంలోని క్వారీలో నిర్వహిస్తున్న బ్లాస్టింగ్తో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు, రైతులు ఫిర్యాదు చేశారని, దీంతో వీటిని పరిశీలించడం జరిగిందన్నారు. జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న క్వారీని కూడా పరిశీలిస్తామన్నారు. పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తామని తెలిపారు. ఏపీఎండీసీ అధికారులతో మాట్లాడుతూ గనుల్లో నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ సంబంధించి రైతులకు తెలియజేయాలని, దారిలో వెళ్తున్న వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఓ సుదర్శన్ రెడ్డి, మైన్స్ మేనేజర్ గోపినాథ్, మాజీ వైస్ ఎంపీపీ గునిపాటి చెన్నరాయుడు, రైతులు పోతల హనుమయ్య, ఎల్ చిన్న ఓబయ్య, ఎల్ దామోదరయ్య, మల్లికార్జున, కొటారి సుబ్రమణ్యం, పూతల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అండ్
సేప్టీ కిషోర్ కుమార్