టమాటా రైతులను ఆదుకునేందుకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

టమాటా రైతులను ఆదుకునేందుకు చర్యలు

Jun 12 2025 7:35 AM | Updated on Jun 12 2025 7:35 AM

టమాటా రైతులను ఆదుకునేందుకు చర్యలు

టమాటా రైతులను ఆదుకునేందుకు చర్యలు

మదనపల్లె రూరల్‌ : టమాటా రైతులను ఆదుకునేందుకు, నష్టాలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమల శాఖ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులతో కమిటీ వేసి అధ్యయనం చేస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌కమిటీ కార్యాలయంలో టమాటా రైతుల సమస్యలపై అధికారులతో ఆయన సమీక్షించారు. టమాటా ఉత్పత్తి, విస్తీర్ణం, దిగుబడులు, మార్కెటింగ్‌, ఎగుమతులు, ధరల ఒడిదుడుకులు, నష్టనివారణ చర్యలు, ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ..టమాటా ఽరైతులు నష్టపోతున్న తరుణంలో వారికి లాభాలు వచ్చేందుకు ఏం చేయాలనే విషయమై చర్చలు జరిపామన్నారు. నెలరోజుల్లోపు నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించామని, రాగానే సీఎం చంద్రబాబునాయుడు, వ్యవసాయశాఖమంత్రి అచ్చెన్నాయుడు, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ.భరత్‌ను కలిసి ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత మార్కెట్‌యార్డు విస్తీర్ణం రైతుల అవసరాలకు సరిపోకపోవడం, ట్రాఫిక్‌సమస్య తలెత్తడంతో మార్కెట్‌ను తరలించి, భవిష్యత్‌ అవసరాలకు సరిపోయేలా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ అఽధికారి సురేష్‌, ఉద్యానశాఖ అధికారిణి సుభాషిణి, లక్ష్మీ ప్రసన్న, ఏడీఏ శివశంకర్‌, ఏఓ నాగప్రసాద్‌, హెచ్‌ఓ ఈశ్వర్‌ప్రసాద్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ సెక్రటరీ అభిలాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మనిర్భర వికసిత్‌ భారత్‌ వైపు పయనం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో, బీజేపీ 11 ఏళ్ల పాలనలో ఆత్మనిర్భర వికసిత్‌ భారత్‌–2047 వైపు దేశం పయనిస్తోందని ఏపీ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్‌ లంకా దినకర్‌ అన్నారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...2014లో ప్రధాని నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించినప్పుడు 11వ స్థానంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి జపాన్‌ను వెనుక్కు నెట్టి 4.20 ట్రిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిలోకేష్‌, ప్రధాన కార్యదర్శులు యల్లంపల్లె ప్రశాంత్‌, ఆకులకృష్ణమూర్తి, భగవాన్‌, బండిఆనంద్‌, ఓసూరికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుపై కార్యాచరణ

20 సూత్రాల కార్యక్రమాల

అమలు కమిటీ చైర్మన్‌ లంకాదినకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement