
ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా!
రాయచోటి టౌన్: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని దీంతో మహిళలకు రక్షణ కరువవుతోందని అన్నయ్య జిల్లా వైఎస్సార్సీపీ మహిళా నాయకులు ఆరోపించారు. మంగళవారం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మహిత, కార్యదర్శులు ఏకుల రాజేశ్వరి, జానం రాధ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చేశారని ఆరోపించారు. అసలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. అన్యాయాలను అరికట్టాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్మకాస్తున్నారని విమర్శించారు. ఇప్పటికై నా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించి మహిళా స్వేచ్ఛ దిశగా అడుగులు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అజంతమ్మ, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల మహిళా అధ్యక్షులు మేరీ, పద్మజారెడ్డి, విజయలక్ష్మి, మిరియాల సురేఖ, నియోజక వర్గం అధ్యక్షురాలు లక్ష్మీనరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడిపిస్తున్న కూటమి ప్రభుత్వం
మహిళలకు రక్షణ కరువు
అంబేడ్కర్ విగ్ర హానికి వైఎస్సార్సీపీ మహిళా నేతల వినతిపత్రం