మదనపల్లె : పట్టణంలోని ప్రశాంత్నగర్ రెండో మెయిన్ మహ్మద్ రఫీ కారు గ్యారేజీలో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఫైర్ ఆఫీసర్ జి.శివప్ప తెలిపారు. ఆదివారం ఉదయం 8.20 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు. అయితే అప్పటికే కారు గ్యారేజీ, టాటా నెక్సాన్ కారు ముందరి భాగం, ఆయిల్, టైర్స్, టూల్స్ మంటల్లో కాలుతున్నాయన్నారు. వెంటనే సిబ్బంది మంటలను ఆర్పివేశారన్నారు. ప్రమాదానికి కారణం తెలియలేదన్నారు.
విద్యుత్ షాక్తో గేదె మృతి
బి.కోడూరు : మండలంలోని ప్రభలవీడు పంచాయతీ పరిధిలోని తిప్పరాజుపల్లె గ్రామానికి చెందిన గంగిరెడ్డి నాగమునిరెడ్డికి చెందిన గేదె ఆదివారం సాయంత్రం విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. ఊరి బయట ఉన్న పొలాల్లోకి మేత కోసం వెళ్లి పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్కు గురైంది. గేదె విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని, సంబంధిత అధికారులు ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.
ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక పాత బీవీఎస్ హాల్ సమీపంలో ఉన్న బాహుబలి ఫర్నీచర్ షాపులో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో షాపులోని ప్లాస్టిక్ డైనింగ్ టేబుళ్లు, చైర్లు, ఇతర వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పేశారు.
ఆటో బోల్తా – వ్యక్తి దుర్మరణం
అట్లూరు : బద్వేలు మండలం రాజుపాలెం గ్రామ సమీపంలో కడప – బద్వేలు ప్రధాన రహదారిపై ఆదివారం ఆటో బోల్తాపడిన ప్రమాదంలో అట్లూరు మండలం ఎస్.వెంకటాపురం అక్కిరెడ్డిగారిపల్లె కాలనీకి చెందిన పొత్తపి చిన్నయ్య (58) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, బంధువుల వివరాల మేరకు చిన్నయ్య బద్వేలుకు వెళ్లి సెల్ఫోన్కు పౌచ్ వేయించుకుని వస్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరాడు. ఏపీ39 టీపీ 6930 నెంబరు గల ఆటోలో ఎక్కి రాజుపాలెం గ్రామ సమీపానికి వెళ్లే సరికి ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడి చిన్నయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
రూ.లక్ష ఆస్తి నష్టం

కారు గ్యారేజీలో అగ్నిప్రమాదం