వైఎస్సార్‌ కడప జిల్లాలో ముగిసిన వైఎస్‌ జగన్‌ పర్యటన | YS Jagan tour ends in Kadapa district | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ కడప జిల్లాలో ముగిసిన వైఎస్‌ జగన్‌ పర్యటన

Nov 28 2025 5:15 AM | Updated on Nov 28 2025 5:22 AM

YS Jagan tour ends in Kadapa district

సాక్షి కడప: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల వైఎస్సార్‌ కడప జిల్లా పర్యటన గురువారం ముగిసింది. పులివెందులలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఉదయం ఆయన బయలుదేరి వెళ్లారు. వైఎస్సార్‌ కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్‌ జగన్‌ తొలిరోజు పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలు, పార్టీ నాయకులతో మమేకమయ్యారు.

రెండో రోజు పులివెందుల పరి«ధిలోని బ్రాహ్మణపల్లె సమీపంలో అరటి తోటలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. పలువురు నేతలను పరామర్శించడంతోపాటు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మూడో­రోజు కూడా ఇల్లు, కార్యాలయం వద్ద వేచి ఉన్న ప్రజలతో మమేకమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement