నేడు గవర్నర్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan To Meet Governor Abdul Nazir Today | Sakshi
Sakshi News home page

నేడు గవర్నర్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ

Dec 18 2025 3:33 AM | Updated on Dec 18 2025 7:18 AM

YS Jagan To Meet Governor Abdul Nazir Today

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ 1,04,11,136 సంతకాల పత్రాలు అందజేత

ఉదయం 10 గంటలకు జెండా ఊపి ఆ పత్రాలున్న వాహనాలను లోక్‌భవన్‌కు పంపనున్న జగన్‌

ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశం

అనంతరం గవర్నర్‌తో భేటీ    

సాక్షి, అమరావతి: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకర­ణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌తో భేటీ కానున్నారు. పార్టీకి చెందిన జిల్లా అధ్య­క్షులు, శాసనసభ్యులు, ఎంపీలు, తదితరులతో కలిసి ఆయన గవర్నర్‌కు 1,04,11,136 సంత­కాల పత్రాలను అందించనున్నారు.

అంతకు ముందు ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలతో వచ్చిన వాహనాలను వైఎస్‌ జగన్‌ జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మె­ల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షు­లు, పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు పాల్గొంటారు.

ఆ తర్వాత వీరితో వైఎస్‌ జగన్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమవు­తారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత గవ­ర్నర్‌ నివాసం లోక్‌భవన్‌కు బయల్దేరి వెళతారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కోటి మందికిపైగా చేసిన సంతకాల పత్రాలతో వాహనా­లు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయా­నికి చేరుకున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement