నడిరోడ్డుపై ఇద్దరు కానిస్టేబుళ్ల ఘర్షణ | Two constables clash on the road | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై ఇద్దరు కానిస్టేబుళ్ల ఘర్షణ

Sep 4 2025 5:44 AM | Updated on Sep 4 2025 5:44 AM

Two constables clash on the road

మహిళతో కానిస్టేబుల్‌ గొడవను అడ్డుకోబోయిన మరో డ్యూటీ కానిస్టేబుల్‌

ఇద్దరు కానిస్టేబుళ్ల మధ్య మాటామాటా పెరగడంతో ఘర్షణ

డ్యూటీ కానిస్టేబుల్‌పై మహిళ పిడిగుద్దులు

వీడియో వైరల్‌ కావడంతో ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేసిన పోలీస్‌ కమిషనర్‌

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌)/­లబ్బీపేట (విజయవాడ తూర్పు) : మహిళతో ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నడిరోడ్డుపై గొడవపడిన ఘటన విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌­స్టేషన్‌ పరిధిలో బుధవారం తెల్లవారు­జామున జరిగింది. వీరిని అడ్డుకోబోయిన డ్యూటీ కానిస్టేబుల్‌తో ఆ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఘర్షణ పడ్డాడు. అంతేకాక.. డ్యూటీ కానిస్టేబుల్‌పై ఆ మహిళ పిడిగుద్దులు గుద్దింది. దీంతో.. ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసు కమిషనర్‌ సస్పెండ్‌ చేశా­రు. 

వివరాలివీ.. నాలుగో పట్టణ ట్రాఫిక్‌ పోలీ­స్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ నాయక్‌ సింగ్‌నగర్‌ డాబాకొట్లు సెంట­ర్‌ సమీపంలో ఉంటున్నాడు. మధురానగర్‌ పసుప­ తోటకు చెందిన ఓ మహిళతో బుధవారం తెల్లవారు­జామున మూడు గంటల ప్రాంతంలో సింగ్‌న­గర్‌­లో గొడవపడ్డారు. ఈ విషయం తెలు­సు­కున్న సింగ్‌­నగర్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ కోటేశ్వర­రావు వీరిని అడ్డుకుని రోడ్లపై గొడవలేంటని ప్రశ్నించా­రు. 

తామిద్దరం బంధువులమని, తాను ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌నంటూ శ్రీనివాస్‌ నాయక్‌ బదులి­వ్వడంతో అక్కడి నుంచి కోటేశ్వ­రరావు వెళ్లి­పో­యాడు. మళ్లీ కాసేపటికి వారిద్దరూ సింగ్‌­నగర్‌ రైతుబజార్‌ వద్దకు వెళ్లి అదే రీతిలో కొట్టు­కుంటుండగా కోటేశ్వరరావు వారిని అడ్డుకు­నేందుకు యత్నించాడు. దీంతో.. శ్రీనివాస్‌­నాయక్, కోటే­శ్వ­రరావు మధ్య మాటా­మాటా పెరి­గింది. 

పోలీస్‌స్టేషన్‌కు రావా­లంటూ శ్రీని­వాస్‌­­నాయ­క్‌­ను తీసుకొస్తుండగా సదరు మహిళ డ్యూటీలో ఉన్న కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని పిడుగు­ద్దు­లు గుద్ది లాక్కెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ కావడంతో విషయం పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు దృష్టికెళ్లింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి­న ఇద్దరు కానిస్టేబుళ్లను సీపీ ఎస్వీ రాజ­శేఖ­ర­బాబు సస్పెండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement