వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్ధంతి కార్యక్రమాలు | YSRCP Leaders Paid Tributes to DR BR Ambedkar at Party central office | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్ధంతి కార్యక్రమాలు

Dec 6 2025 11:23 AM | Updated on Dec 6 2025 1:49 PM

YSRCP Leaders Paid Tributes to DR BR Ambedkar at Party central office

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నేడు డా.బీఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా ఈ కార్యక్రమానికి కార్యాలయ ఇన్ఛార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, నందమూరి లక్ష్మీ పార్వతి, మేరుగ నాగార్జున, జూపూడి ప్రభాకర్, దొంతిరెడ్డి వేమారెడ్డి, రాజశేఖర్ తదితరులు హాజరైయ్యారు.

అంబటి రాంబాబు, మాజీమంత్రి కామెంట్స్..
భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం.

బడుగు, బలహీనవర్గాలకు భారతదేశంలో రక్షణ కల్పించిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. బలహీన వర్గాల రిజర్వేషన్ కోసం అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది. పేద వర్గాలు కొంతమేర అభ్యున్నతి సాధించారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే. అంబేద్కర్ లాంటి మేధావి భారతదేశంలో పుట్టడం గర్వకారణం. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.భారత జాతి ఉన్నంతకాలం అంబేద్కర్ ను గౌరవించుకోవాల్సిన బాధ్యత  ఉంది.

విజయవాడ నగరం నడిబొడ్డున దేశంలోనే ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ స్మృతి వనం అశ్రద్ధకు గురవుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అంబేద్కర్ వ్యతిరేక విధానాలను అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అంబేద్కర్ లాంటి మహనీయుడిని గౌరవించాల్సిందే.

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు వైసిపి కార్యాలయంలో డా.బిఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండల,పట్టణ పార్టీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్ కుమార్,చలమాల సత్యనారాయణ.

అనంతపురం: గుంతకల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్  సర్కిల్ లో  అంబేద్కర్ వర్థంతి సందర్బంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు. పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, వైస్ చైర్ పర్సన్  నైరుతి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.

కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజి ఎంపి కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య.

ఏలూరు జిల్లా: చింతలపూడి మండలం చింతలపూడి లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా  అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నియోజకవర్గ ఇంచార్జి కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాధరావు మరియు పలువురు వైసీపీ శ్రేణులు.

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వైసిపి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. పాల్గొన్న న్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజ,బెల్లందుర్గ , మాజీ ఏపీఐడిసి ఛైర్మన్ బండి పుణ్యశీల, వైసిపి సోషల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, కార్పొరేటర్లు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైసీపీ నేతలు.

బాపట్ల జిల్లా: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ  వర్ధంతి సందర్భంగ రైల్వేస్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ సమన్వయకర్త మాజీ డైప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకాశం: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69 వ వర్దంతి సంధర్బంగా ఒంగోలు వైయస్సార్సీపి పార్టీ ఆఫీస్ లో  అంబేద్కర్ చిత్రపటానికి   పూల మాల వేసి నివాళులు అర్పించిన ఒంగోలు వైయస్సార్సీపి ఇంచార్జ్ చుండూరి రవి బాబు, జిల్లా పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మనందరెడ్ది.

పల్నాడు: నరసరావుపేట గడియార స్తంభం సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

చిలకలూరిపేట పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు.

గుంటూరు: మంగళగిరిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ  వర్ధంతి సందర్భంగా మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ సమన్వయకర్త  దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ, నాయకులు కార్యకర్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement