breaking news
srinivas nayak
-
నడిరోడ్డుపై ఇద్దరు కానిస్టేబుళ్ల ఘర్షణ
అజిత్సింగ్నగర్ (విజయవాడ సెంట్రల్)/లబ్బీపేట (విజయవాడ తూర్పు) : మహిళతో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నడిరోడ్డుపై గొడవపడిన ఘటన విజయవాడ అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. వీరిని అడ్డుకోబోయిన డ్యూటీ కానిస్టేబుల్తో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఘర్షణ పడ్డాడు. అంతేకాక.. డ్యూటీ కానిస్టేబుల్పై ఆ మహిళ పిడిగుద్దులు గుద్దింది. దీంతో.. ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. వివరాలివీ.. నాలుగో పట్టణ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీనివాస్ నాయక్ సింగ్నగర్ డాబాకొట్లు సెంటర్ సమీపంలో ఉంటున్నాడు. మధురానగర్ పసుప తోటకు చెందిన ఓ మహిళతో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో సింగ్నగర్లో గొడవపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సింగ్నగర్ డ్యూటీ కానిస్టేబుల్ కోటేశ్వరరావు వీరిని అడ్డుకుని రోడ్లపై గొడవలేంటని ప్రశ్నించారు. తామిద్దరం బంధువులమని, తాను ట్రాఫిక్ కానిస్టేబుల్నంటూ శ్రీనివాస్ నాయక్ బదులివ్వడంతో అక్కడి నుంచి కోటేశ్వరరావు వెళ్లిపోయాడు. మళ్లీ కాసేపటికి వారిద్దరూ సింగ్నగర్ రైతుబజార్ వద్దకు వెళ్లి అదే రీతిలో కొట్టుకుంటుండగా కోటేశ్వరరావు వారిని అడ్డుకునేందుకు యత్నించాడు. దీంతో.. శ్రీనివాస్నాయక్, కోటేశ్వరరావు మధ్య మాటామాటా పెరిగింది. పోలీస్స్టేషన్కు రావాలంటూ శ్రీనివాస్నాయక్ను తీసుకొస్తుండగా సదరు మహిళ డ్యూటీలో ఉన్న కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని పిడుగుద్దులు గుద్ది లాక్కెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో విషయం పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు దృష్టికెళ్లింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సీపీ ఎస్వీ రాజశేఖరబాబు సస్పెండ్ చేశారు. -
భక్తులను కాపాడబోయి మృత్యుఒడికి...
విద్యుదాఘాతంతో కానిస్టేబుల్ మృతి శివవరాత్రి పర్వదినాన అపశ్రుతి బహదూర్ఫురా: శివరాత్రి పర్వదినం సందర్భంగా గుడి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. భక్తులను విద్యుత్ వైర్లు ఉన్న వైపు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్న క్రమంలోనే అతడు షాక్కు గురయ్యాడు. ఈ విషాద ఘటన బహదూర్పుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పో లీసుల కథనం ప్రకారం... మహాశివరాత్రి సందర్భంగా కిషన్బాగ్లోని కాశిబుగ్గ గుడి వద్ద సోమవారం బహదూర్పురా పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ (25) బందోబస్తులో ఉన్నాడు. వందలాదిగా తరలివస్తున్న భక్తులను అతను అదుపు చేస్తున్నాడు. రద్దీ ఎక్కువగా ఉండటంతో కొందరు భక్తులు మధ్యాహ్నం ఒంటి గంటకు గర్భగుడి పక్కనున్న మరో దారిలో బయటికి వెళ్లేందుకు యత్నించగా అడ్డుకొని పక్కకు పంపించాడు. ఇదే క్రమంలో శ్రీనివాస్ నాయక్ కాలు జారి విద్యుత్ వైర్లపై పడ్డాడు. షాక్కు గురై పక్కనే ఉన్న నీటి సంపులో పడిపోయాడు. తోటి కానిస్టేబుళ్లు వెంటనే మెయిన్ ఆఫ్ చేసి శ్రీనివాస్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందా డు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, చార్మినార్ ఏసీపీ అశోక చక్రవర్తి, బహదూర్పురా ఇన్స్పెక్టర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శ్రీనివాస్ నాయక్ మృతదేహాన్ని నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి సందర్శించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శ్రీనివాస్నాయక్ మృతి వార్త తెలిసి అతడు నివాసముండే ఆర్ఎన్ కాలనీకి బంధువులు,స్నేహితులు పెద్ద ఎత్తున చేరుకొని విలపించారు. -
బావమరుదులు, భార్య చేతిలో పాత్రికేయుడి హత్య!
ఒక వార్తాకథనం పాత్రికేయుడి హత్యకు దారితీసింది. హత్య జరిగిన 8 నెలలకు శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేశారు. ఈ కేసులో హతుడి సొంత బావమరుదులే నిందితులు కాగా.. అతడి భార్య కూడా హత్యకు సహకరించింది! ఈ దారుణ సంఘటన కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం తాలూకాలో జరిగింది. బెంగళూరు కిర్లోస్కర్ ఫౌంట్రి కాలనీలో నివాసముంటున్న శ్రీనివాస్ నాయక్(29) ‘పత్రికా లోకం’ పేరుతో ఒక పత్రిక నడుపుతున్నాడు. తన సొంత గ్రామం కెళగిననాయకరండనహళ్లికి చెందిన పద్మబాయిని ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి తరచూ గొడవపడేవారు. ఆమె తమ్ముళ్లు కూడా వచ్చి, అక్క తరఫున మాట్లాడుతూ శ్రీనివాస్ను అవమానించేవారు. శ్రీనివాస్ నాయక్ బెంగళూరులోనే ఎక్కువ కాలం గడుపుతుండటంతో పద్మబాయికి వెంకటేశ్ అనే ఆటో డ్రైవర్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దాన్ని ఆమె తల్లి, సోదరులు కూడా ప్రోత్సహించారు. దీనిపై తీవ్రంగా ఆగ్రహించిన శ్రీనివాస్ నాయక్ తన సొంత పత్రికలోనే పద్మబాయి తల్లి, తమ్ముళ్లు దొంగ సారా కాస్తున్నట్లు ప్రత్యేక కథనం రాశాడు. దీంతో పలుమార్లు బావమరుదులు శ్రీనివాస్పై దాడులు చేశారు. పరస్పర దాడులతో విద్వేషాలు రగిలాయి. 2013 ఆగస్టు 5న కెళగిన నాయకరండనహళ్లి వద్ద రాత్రి ఒంటరిగా దొరికిన శ్రీనివాస్ నాయక్పై అతడి బావమరుదులు రవినాయక్, నటరాజ్ నాయక్, సంతోష్ నాయక్ దాడిచేసి హత్యచేశారు. మృతదేహాన్ని పట్టణ శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న టెర్రాకాన్ సాయిఎన్క్లేవ్ లేఔట్లో పార్కు కోసం కేటాయించిన స్థలంలో గుంతతవ్వి పూడ్చివేశారు. శ్రీనివాస్ నాయక్ కనిపించలేదని ఆయన తల్లి మునిబాయి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, భార్య మాత్రం ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్ బావమరుదులపై అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం తహసీల్దార్ సిద్ధలింగయ్య సమక్షంలో డీవైఎస్పీ కోనప్ప రెడ్డి, సీఐ శివారెడ్డి, రూరల్ ఎస్సై నవీన్ సిబ్బందితో కలసి శవాన్ని పూడ్చి పెట్టిన ప్రాంతంలో జేసీబీతో వెలికి తీయించారు. ఈ ఘటనకు సంబంధించి డీవైఎస్పీ కోనప్ప రెడ్డి మాట్లాడుతూ ఈ హత్య కేసులో మరో ఇద్దరు మహిళలకు కూడా సంబంధం ఉందని తెలిపారు. వారినీ త్వరలో అరెస్టు చేస్తామని, అనంతరం పూర్తి వివరాలు అందిస్తామని వివరించారు.