సచివాలయాలు బేస్‌ క్యాంప్‌లుగా పని చేయాలి | Secretariats should act as base camps says cm | Sakshi
Sakshi News home page

సచివాలయాలు బేస్‌ క్యాంప్‌లుగా పని చేయాలి

Oct 29 2025 5:17 AM | Updated on Oct 29 2025 5:40 AM

Secretariats should act as base camps says cm

పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలి 

సీఎం చంద్రబాబు నాయుడు

సాక్షి, అమరావతి: మోంథా ప్రభా­విత ప్రాంతాల్లో సహాయక చ­ర్యల విషయంలో క్షేత్ర స్థాయి సిబ్బంది గ్రామ, వా­ర్డు సచివాలయాలు బేస్‌ క్యాంప్‌గా పని చేయాలని సీఎం చంద్ర­బాబు ఆదేశించారు. తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్ర­బాబు ఆర్టీజీఎస్‌ కేంద్రంగా మంగళవారం ఉదయం, సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 వేల జనరేటర్లు ఏ­ర్పాటు చేయా­లని ఆదేశించారు.   

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం 
మంగళవారం సాయంత్రం వరకు శ్రీ పొట్టి శ్రీ­రా­ములు నెల్లూరు జి­ల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపా­రు. వర్షం వల్ల ఇప్పటి వరకు అంబేడ్కర్‌ కోన­సీమ, తూర్పు గోదావరి, ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో 43వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయని అధికారులు తెలి­పారు. పంట నష్టం వివరాలను రైతులు కూడా పంపేలా వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్‌­లో మార్పు, చేర్పులు చేయాలని సీఎం సూ­చించారు. వెంటనే పంటనష్టం అంచనా­లు రూపొందించి కేంద్రానికి పంపాలని చెప్పారు. 

తుపాను ప్ర­భావిత ప్రాంతాలకు బృందాన్ని పంపాలని ఆదేశించారు. కాగా, తుఫాను ప్రభావం ఉన్న గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బందితో ఆర్టీజీఎస్‌ నుంచి సీఎం చంద్రబాబు మంగళవారం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడా­రు. తుపాను ప్రభావంపై ఆరా తీసి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జీఎస్‌ కేంద్రంగా మంగళవారం ఉదయం, సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 వేల జనరేటర్లు ఏ­ర్పాటు చేయా­లని ఆదేశించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement