రూ.635.21 కోట్లతో అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ

Restoration of Annamayya project with above Rs 635 crores - Sakshi

టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన జలవనరుల శాఖ

పనుల పూర్తికి రెండేళ్లు గడువు

జనవరి 10లోగా షెడ్యూలు దాఖలుకు అవకాశం

17న ఆర్థిక బిడ్‌.. అదే రోజున రివర్స్‌ టెండరింగ్‌

తక్కువ ధరకు కోట్‌చేసిన సంస్థకు పనుల అప్పగింత

సాక్షి, అమరావతి: గతేడాది నవంబర్‌ 19న చెయ్యేరుకు వచ్చిన ఆకస్మిక భారీ వరదలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించే పనులకు రూ.635.21 కోట్ల అంచనాతో జలవనరులశాఖ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. లంప్సమ్‌–ఓ­పెన్‌ విధానంలో రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తిచేయాలని షరతు విధించింది. జనవరి 10వ తేదీలోగా టెండర్‌లో పాల్గొనేందుకు షెడ్యూలు దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది.

ఆర్థిక బిడ్‌ను జనవరి 17న ఉదయం 11 గంటలకు తెరిచి, మధ్యాహ్నం 2.30 గం­టల నుంచి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహి­స్తా­రు. తక్కువ ధరకు కో­ట్‌ చేసిన కాంట్రాక్టు సంస్థకు టెండర్‌ అప్పగించా­లని స్టేట్‌ లెవల్‌ టెక్నికల్‌ కమిటీ (ఎస్‌.ఎల్‌.టి.సి.)కి ప్రతిపాదనలు పంపుతారు. కాంట్రాక్టు సంస్థ అర్హతలను మరో­సారి పరిశీలించి, నిబంధనల ప్రకారం టెండర్‌ను ఎస్‌.ఎల్‌.టి.సి. ఆమోదిస్తుంది. తర్వా­త కాంట్రాక్టు సంస్థకు పనులు అప్ప­గిస్తూ జల­వనరుల శాఖ ఒప్పందం చేసుకుంటుంది.

అ­ధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో
అన్నమయ్య జిల్లా­లో రాజంపేట మండలంలోని బాదనగడ్డ వద్ద చె­య్యే­రుపై దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును 2.24 టీఎంసీల సామర్థ్యంతో పునరుద్ధరించేలా పనులను కాంట్రా­క్టు సంస్థ చేపడుతుంది. చెయ్యేరుకు భారీ వరద వచ్చినా చెక్కుచెదరకుండా నిలబడేలా అ­ధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య ప్రా­­జెక్టు పునరుద్ధరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top