రాజ్‌భవన్‌లో రక్షాబంధన్‌ వేడుకలు రద్దు | Raksha Bandhan Celebration Canceled In AP Raj Bhavan | Sakshi
Sakshi News home page

ఏపీ రాజ్‌భవన్‌లో రక్షాబంధన్‌ వేడుకలు రద్దు

Aug 2 2020 2:50 PM | Updated on Aug 2 2020 3:21 PM

Raksha Bandhan Celebration Canceled In  AP Raj Bhavan - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజ్‌ భవన్‌లో సోమవారం జరగాల్సిన రక్షా బంధన్ వేడుకలపై కోవిడ్‌ ఎఫెక్ట్‌ పడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా రేపు జరగాల్సిన వేడుకలను రాజ్‌ భవన్‌ రద్దు చేసింది. రక్షా బంధన్‌ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఫేస్‌ మాస్కులు ధరించి, జాగ్రత్తలతో ఇంటి వద్దే పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. సబ్బు లేదా శానిటైజర్లతో చేతులు శుభ్రపరుచుకోవాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. 
(చదవండి : నూలు వెచ్చని రక్షాబంధం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement