కొనసాగుతున్న పీహెచ్‌సీ వైద్యుల రిలే దీక్షలు | PHC doctors relay hunger strike enters 8 day in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న పీహెచ్‌సీ వైద్యుల రిలే దీక్షలు

Oct 13 2025 5:04 AM | Updated on Oct 13 2025 5:04 AM

PHC doctors relay hunger strike enters 8 day in Andhra Pradesh

రిలే దీక్షల్లో పీహెచ్‌సీ వైద్యులు

ఎనిమిదో రోజుకు చేరిన నిరసనలు

లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ సమస్యలు పరిష్కరించాలని కోరు­తూ ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ ధర్నా చౌక్‌లో పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం ఎనిమిదో రోజుకు చేరాయి. ఏపీ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రిలే దీక్షల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వైద్యులు పాల్గొంటున్నారు. అసోసియేషన్‌ పిలుపు మేరకు రాష్ట్రంలోని 2,700 మంది వైద్యులు విధులు బహిష్కరించి దీక్షలు చేపట్టారు.

తమ డిమాండ్‌లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ ఆందోళనను విరమించే­ది లేదని స్పష్టం చేస్తున్నారు. నోషనల్‌ ఇంక్రిమెంట్స్, గిరిజన ప్రాంతాల్లో ప­ని­­చేసే వారికి అదనపు భత్యం, టైమ్‌బాండ్‌ పదోన్నతులు, స్కేల్స్‌ వర్తింపు వంటి అనేక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ రిలే దీ­క్ష­ల్లో అసోసియేషన్‌ నాయకులు డాక్టర్‌ వినోద్‌కుమార్, డాక్టర్‌ రవీంద్రనాయక్, డాక్టర్‌ గోపినాథ్, డాక్టర్‌ కిషోర్‌తో పాటు, వందలాది వైద్యులు పాల్గొన్నారు.

నేటి నుంచి సిబ్బంది నిరసన..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలు, సెకండరీ హెల్త్‌ సెంటర్స్‌లోని వైద్య సి­బ్బ­ంది సోమవారం నుంచి వైద్యులకు మద్దతుగా నల్లబ్యాడ్జిలు ధరించి వి­ధు­లకు హాజరుకానున్నారు. లంచ్‌ సమయంలో సమావేశాలు, నిరసనలు తె­లి­పేందుకు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని వైద్యులతో పాటు, వైద్య సి­బ్బ­ంది కూడా నిరసనలో పాల్గొంటారని డాక్టర్స్‌ అసోసియేషన్‌ నేతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement