ధర్మస్థళపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు | CPI Narayana Sensational Comments On Dharmasthala Mass Burial Mystery Case, More Details Inside | Sakshi
Sakshi News home page

Dharmasthala Case: ధర్మస్థళపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

Aug 9 2025 10:58 AM | Updated on Aug 9 2025 12:24 PM

CPI Narayana Sensational Comments On Dharmasthala Case

సాక్షి, తిరుమల: కర్ణాటకలోని ధర్మస్థళలో అనుమానాస్పద మిస్టరీ మరణాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రస్ట్‌ చైర్మన్‌, సభ్యులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దాదాపు 500 మంది అమ్మాయిలపై లైంగిక దాడి చేసి, హత్య చేసి పూడ్చి పెట్టారంటూ ఆరోపణలు చేశారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ..‘కర్నాటకలోని ధర్మస్థళ ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉంది. ధర్మస్థళ ట్రస్ట్‌కు ఏడాదికి రూ.100 కోట్లు ఆదాయం వస్తుంది. ట్రస్ట్‌ చైర్మన్‌, సభ్యులను వెంటనే అరెస్ట్‌ చేయాలి. ట్రస్ట్‌ను ఎండోమెంట్‌ విభాగం స్వాధీనం చేసుకోవాలి. 500 మందిపై లైంగిక దాడి చేసి హత్య చేసి పూడ్చి పెట్టారు. అది దేవస్థానమా లేక స్మశాన వాటికా?. తవ్వే కొద్దీ పుర్రెలు, ఎముకలు బయటపడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది కాబట్టి సిట్‌ వేశారు.. మరో ప్రభుత్వం అయితే ఇది బయటకు వచ్చేది కాదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

సిట్‌ తవ్వకాలు.. 
ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కర్ణాటకలోని ధర్మస్థళ ఖననాల కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మరో కొత్త ప్రదేశంలో తవ్వకాలను చేపట్టింది. గుర్తు తెలియని ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఆ ప్రాంతంలో సిట్‌తో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, సాంకేతిక సిబ్బంది కూడా ఉన్నారు. ఈ తవ్వకాలు కఠినమైన భద్రత మధ్య నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. అయితే ఆ స్థలం నుంచి కనుగొన్న వాటి గురించి ఇప్పటివరకు వెల్లడించలేదు. అన్ని ఆధారాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని అన్నారు. తదుపరి చర్యలు, ఫోరెన్సిక్ నివేదికలు చట్టపరమైన ప్రక్రియల ఆధారంగా ఉంటాయని తెలిపారు. అయితే, ఈ దర్యాప్తు ప్రజలు, రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చలకు దారి తీసిందని అధికారులు అన్నారు.

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
మరోవైపు ధర్మస్థలలో సామూహిక అంత్యక్రియల కేసును నివేదించకుండా మీడియాను నిరోధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆలయాన్ని నిర్వహిస్తున్న కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మీడియా కథనాలు వస్తున్నాయని ధర్మస్థళ ఆలయ కార్యదర్శి వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు పేర్కొంది. పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ ధర్మస్థళ ఆలయ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌ను పునఃపరిశీలించాలని కర్ణాటకలోని ట్రయల్ కోర్టును ఆదేశించింది. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే గ్యాగ్ ఆర్డర్లు జారీ చేస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. అన్ని విషయాలను ట్రయల్ కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement